వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రైవేట్ దోపిడీకి చెక్ ... తెలంగాణా ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సల గరిష్ట ధరల జీవో జారీ చేసిన సర్కార్

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న తర్వాత,కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా దోపిడి చేసిన తర్వాత, ఆస్తులు అమ్ముకొని ఇళ్ళు ఒళ్ళు గుల్ల చేసుకొని ఆసుపత్రుల్లో డబ్బులు చెల్లించి కరోనా బాధిత కుటుంబాలు కంటికి కడివెడు ఏడ్చిన తరువాత ఫైనల్ గా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కళ్లు తెరిచింది.

వెంటిలేటర్ తో కూడిన ఐసియు గదికి రోజుకు 9 వేల రూపాయల గరిష్ట ధర

వెంటిలేటర్ తో కూడిన ఐసియు గదికి రోజుకు 9 వేల రూపాయల గరిష్ట ధర


రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రులలో కరోనా చికిత్సల, పరీక్షల గరిష్ట ధరలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. కరోనా చికిత్సల చార్జీలపై వైద్యారోగ్యశాఖ జీవో 40 ని జారీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన జీవో ప్రకారం ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వం ఖరారు చేసిన ధరల వివరాలు చూస్తే సాధారణ వార్డులో ఐసోలేషన్, పరీక్షలకు రోజుకు గరిష్టంగా నాలుగు వేల రూపాయలు మాత్రమే తీసుకోవాలి. ఐసియు గదిలో రోజుకు గరిష్టంగా 7500 రూపాయలు, వెంటిలేటర్ తో కూడిన ఐసియు గదిలో రోజుకు 9 వేల రూపాయలకు మించి చార్జ్ చేయకూడదు.

పరీక్షల ధరలను సైతం వెల్లడించిన సర్కార్

పరీక్షల ధరలను సైతం వెల్లడించిన సర్కార్


ఇక పిపిఈ కిట్ కు 273 రూపాయలు, హెచ్ ఆర్ సిటి స్కాన్ కు 1995 రూపాయలు, డిజిటల్ ఎక్స్ రే కు 1300 రూపాయలు, ప్రొకాల్ సితోసిన్ కు 1,400 రూపాయలు, ఐఎల్ 6 కు 1300 రూపాయలు, డీ డైమర్ కు 300 రూపాయలు, సి ఆర్ పి 500 రూపాయలు, ఫెరిటీన్ 400 రూపాయలు , ఎల్ డి హెచ్ కు 140 రూపాయలకు మించి ఛార్జ్ చేయకూడదు. అదేవిధంగా ఆక్సిజన్ సౌకర్యం ఉన్న అంబులెన్స్ కు కిలోమీటరుకు 75 రూపాయల చొప్పున నిర్ణయించారు. ఇక మినిమమ్ ఛార్జ్ 2000 రూపాయలు గా పేర్కొన్నారు.

 అంబులెన్సుల చార్జీలు ఇలా

అంబులెన్సుల చార్జీలు ఇలా


అధునాతన వెంటిలేటర్ సౌకర్యం ఉన్న అంబులెన్స్ కు కిలోమీటర్ కు 125 రూపాయల చొప్పున , మినిమమ్ ఛార్జ్ మూడు వేల రూపాయల చొప్పున నిర్ణయించారు. ఈ ధరలను మించి ప్రైవేట్ ఆసుపత్రులలో రోగుల వద్ద నుండి వసూలు చేయడానికి వీలు లేదని తెలంగాణ సర్కార్ జీవో జారీ చేసింది. ఈ జీవోను అతిక్రమించి ఎవరైనా అధిక ఫీజుల వసూళ్లకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని తేల్చి చెబుతోంది.

Recommended Video

Hyderabad MMTS Trains Services Resumes From Today After 15 Months | SCR | Oneindia Telugu
ఇప్పటికైనా ప్రైవేట్ దోపిడీకి చెక్ పడుతుందా ?

ఇప్పటికైనా ప్రైవేట్ దోపిడీకి చెక్ పడుతుందా ?

మరి ఇంత కాలం లక్షలకు లక్షలు దోపిడీ చేసిన ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వం తాజా నిర్ణయంతోనైనా తమ వైఖరి మార్చుకుంటాయా.. లేక అదే విధంగా అడ్డగోలు దోపిడీకి తెగబడతాయా అనేది తెలియాల్సి ఉంది. అంతేకాదు ప్రభుత్వం ఖరారు చేసిన ధరలపై ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు ఏమంటారో కూడా తెలియాల్సి ఉంది.

English summary
The Telangana government has fixed the maximum prices for corona treatments and tests in private hospitals in the state. The Department of Health has issued G.o 40 on corona treatment charges. According to G.o, released by the Ministry of Medical Health, in private hospitals, a maximum of Rs 4,000 per day is required for isolation and testing in the general ward. A maximum of Rs 7,500 per day in the ICU room and no more than Rs 9,000 per day in the ICU room with ventilator.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X