వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీవారి భక్తులకు జీఎస్టీ దెబ్బ: నేటి నుంచే వసూలు

నేటి నుంచి తిరుమల భక్తులపై జీఎస్టీ భారం పడనుంది. టీటీడీ అద్దె గదుల కేటాయింపులో జీఎస్టీ వర్తింపజేస్తూ ప్రకటన విడుదల చేసింది. సోమవారం నుంచి టిటిడి అద్దె గదులకు సంబంధించి అదనపు పన్ను వసూలు చేయనుంది.

|
Google Oneindia TeluguNews

తిరుమల: సుదూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చి వసతి పొందే శ్రీవారి భక్తులకు ఇ కనుంచి వస్తుసేవల పన్ను(జిఎస్‌టి) పన్ను భారం పడనుంది. దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అద్దె గదుల కేటాయింపులో జీఎస్టీ వర్తింపజేస్తూ ప్రకటన విడుదల చేసింది.

సోమవారం నుంచి టిటిడి అద్దె గదులకు సంబంధించి అదనపు పన్ను వసూలు చేయనుంది. అయితే రూ.1000లోపు అద్దె గదులకు మాత్రం జీఎస్టీ నుంచి మినహాయింపునిచ్చింది. రూ.వెయ్యి నుంచి రూ.2వేల అద్దె గదులపై 12 శాతం జీఎస్టీ విధించింది.

GST to impact the rates of 1000 cottages in Tirumala

ఇక రూ.2,500 నుంచి రూ.6వేల అద్దె గదులపై 18 శాతం అమలు చేయనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ నుంచి టీటీడీకి మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. అయితే తిరుమలకు ఇస్తే దేశంలోని మిగతా ప్రముఖ దేవాలయాలూ కోరతాయంటూ రాష్ట్రప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించిన సంగతి తెలిసిందే.

English summary
With the effect of Goods and Services Tax (GST), the impact will be on the tariffs of 1000 cottages which will come into effect from July 10onwards. However this changed rates will be applicable only for the rest houses pricing over Rs.1000 and above only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X