ఎవ్వరినీ వదిలి పెట్టేది లేదు: టిడిపి నేతలకు వైసిపి నేత హెచ్చరిక
అధికార తెలుగుదేశం పార్టీ అండతో నాయకులు విచ్చలవిడిగా భూములు కబ్జా చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు.
విశాఖ: అధికార తెలుగుదేశం పార్టీ అండతో నాయకులు విచ్చలవిడిగా భూములు కబ్జా చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. వైసిపి సేవ్ విశాఖ పేరుతో గురువారం చేపట్టిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు.
చంద్రబాబు, లోకేష్, గంటాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జగన్
తమ పార్టీ అధికారంలోకి వచ్చాక భూకబ్జాదారులెవరినీ వదిలిపెట్టబోమని, అందరినీ జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
పేదలను భూములను టిడిపి నేతలు కొల్లగొట్టారని వైసిపి నేత కరణం ధర్మశ్రీ ఆరోపించారు. పక్కా వ్యూహంతో ప్రకారం భూములు కబ్జా చేసి తమ బినామీలకు కట్టబెట్టారన్నారు. చోడవరం నియోజకవర్గంలోనూ కబ్జాలకు పాల్పడ్డారన్నారు.
అధికార టిడిపి నాయకులు లక్ష ఎకరాల భూములు చట్టవిరుద్ధంగా ఆక్రమించారని వైసిపి నేత మల్లా విజయప్రసాద్ ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతుందన్నారు.