వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవ్వరినీ వదిలి పెట్టేది లేదు: టిడిపి నేతలకు వైసిపి నేత హెచ్చరిక

అధికార తెలుగుదేశం పార్టీ అండతో నాయకులు విచ్చలవిడిగా భూములు కబ్జా చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు.

|
Google Oneindia TeluguNews

విశాఖ: అధికార తెలుగుదేశం పార్టీ అండతో నాయకులు విచ్చలవిడిగా భూములు కబ్జా చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. వైసిపి సేవ్‌ విశాఖ పేరుతో గురువారం చేపట్టిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు.

<strong>చంద్రబాబు, లోకేష్, గంటాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జగన్</strong>చంద్రబాబు, లోకేష్, గంటాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జగన్

తమ పార్టీ అధికారంలోకి వచ్చాక భూకబ్జాదారులెవరినీ వదిలిపెట్టబోమని, అందరినీ జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.

Gudiwada Amarnath lashes out at TDP government

పేదలను భూములను టిడిపి నేతలు కొల్లగొట్టారని వైసిపి నేత కరణం ధర్మశ్రీ ఆరోపించారు. పక్కా వ్యూహంతో ప్రకారం భూములు కబ్జా చేసి తమ బినామీలకు కట్టబెట్టారన్నారు. చోడవరం నియోజకవర్గంలోనూ కబ్జాలకు పాల్పడ్డారన్నారు.

అధికార టిడిపి నాయకులు లక్ష ఎకరాల భూములు చట్టవిరుద్ధంగా ఆక్రమించారని వైసిపి నేత మల్లా విజయప్రసాద్‌ ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతుందన్నారు.

English summary
YSR Congress Party leader Gudiwada Amarnath lashed out at TDP government in Save Vishaka meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X