వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో గ్రేహౌండ్స్, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు:ఆర్కే ఉన్నాడా?
విశాఖపట్నం:ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పుల జరుగుతున్నట్లు తెలిసింది. బలిమెల రిజర్వాయర్ పరిధిలోని సిమిలిపొదర్ అటవీ ప్రాంతంలో ఉదయం నుంచి ఈ కాల్పుల పోరాటం కొనసాగుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ఈ కాల్పులు జరుగుతున్న ప్రాంతంలో మావోయిస్టు అగ్ర నేత ఆర్కే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాల్పులు,ఆర్కే గురించి పోలీసులను మీడియా ప్రశ్నించగా కాల్పులు జరుగుతున్న విషయం వాస్తవమేనని అంగీకరించారు.
అయితే ఆ ప్రాంతంలో ఆర్కే ఉన్నాడా లేదా అనేది ఇప్పుడే ఏమీ చెప్పలేమని తెలపారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్న విషయాన్ని నిర్థారించారు. అయితే దండకారణ్యంలో మావోయిస్ట్ ల సమాచారం పోలీసులకు తెలియడంతో పెద్ద స్కెచ్ వేశారని, ఈ కాల్పుల్లో పోలీసులదే పైచేయి అవచ్చని స్థానికంగా ప్రచారం జరుగుతుంది.
Comments
English summary
Visakhapatnam: There is a fierce encounter between the Greyhounds troops and the Maoists on the Andhra-Odisha border. There is a information of Maoist Top Leader RK in the gunfiring area.
Story first published: Thursday, May 17, 2018, 13:37 [IST]