గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రియుడిని కలిసేందుకు అడ్డు వస్తున్నాడని, మర్మాంగంపై దాడి చేసి భర్తను చంపిన భార్య

|
Google Oneindia TeluguNews

గుంటూరు: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఓ భార్య తన భర్తనే హతమార్చిన సంఘటన గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం మండలం శిరంగిపాలెంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రత్నబాబు తాపీ పని చేస్తుంటాడు. అతనికి తొమ్మిదేళ్ల క్రితం స్వర్ణలత అనే మహిళతో పెళ్లయింది.

ఆమెకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భర్త పలుమార్లు నిలదీశాడు. భార్యాభర్తల మధ్య గొడవ జరిగి స్వర్ణలత పుట్టింటికి పోయింది. పెద్దలు నచ్చజెప్పడంతో పదిహేను రోజుల క్రితం తిరిగి వచ్చింది. అయితే తన భర్త తాను ప్రియుడితో కలిసి ఉండేందుకు అడ్డు వస్తున్నాడని భావించి, స్వర్ణలత నిద్రపోతున్న తన భర్త గొంతు నులిమి, పచ్చడి బండతో మర్మాంగంపై కొట్టడంతో మృతి చెందాడు.

తన చెల్లెలితో వివాహేతర సంబంధం, భర్తపై కోపంతో కొడుకును చంపిన తల్లితన చెల్లెలితో వివాహేతర సంబంధం, భర్తపై కోపంతో కొడుకును చంపిన తల్లి

వివాహేతర సంబంధం, ఆ తర్వాత కూడా కొనసాగింపు

వివాహేతర సంబంధం, ఆ తర్వాత కూడా కొనసాగింపు

స్వర్ణలతకు తాను పని చేసే చోట ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రియుడితో పరిచయం ఏర్పడిందని తెలుస్తోంది. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గొడవలు జరిగి వెళ్లిపోయి, పెద్దల జోక్యంతో తిరిగి వచ్చిన తర్వాత కూడా అతనితో సంబంధం కొనసాగిస్తుందని భర్త భావించాడు.

భర్త వద్దకు తిరిగి వచ్చినా

భర్త వద్దకు తిరిగి వచ్చినా

దాదాపు పదిహేను రోజుల క్రితం స్వర్ణలత తిరిగి భర్త వద్దకు వచ్చింది. అప్పటి నుంచి ఇదే విషయమై పలుమార్లు గొడవలు జరిగాయని తెలుస్తోంది. శుక్రవారం రాత్రి మరోసారి గొడవలు జరిగాయి. ఆ తర్వాత భర్త నిద్రించాడు. అప్పుడు భార్య అతనిని చంపేసింది. గొంతు నులిమి, పచ్చడి బండ, కొడవలితో గాయపరిచి హతమార్చింది.

 భర్త ప్రతిఘటించాడు కానీ

భర్త ప్రతిఘటించాడు కానీ

నిద్రలో నుంచి లేచిన భర్త ప్రతిఘటించాడు. కానీ అప్పటికే తీవ్రంగా గాయపడిన అతను నిస్సహాయస్థితిలో ఉన్నాడు. అప్పుడు శ్వాస ఆడకుండా చేసి చంపేసింది. వీరికి ఇధ్దరు పిల్లలు ఉన్నారు. ఒకరు ఏడేళ్లు, ఒకరికి ఆరేళ్లు. ఆ సమయంలో వారు నిద్రిస్తున్నారు. ఇంట్లో గొడవ జరుగుతున్న విషయం తెలిసి చుట్టుపక్కల వారు తరలి వచ్చారు. కానీ అప్పటికే అతను చనిపోయాడు.

 పోలీసుల అదుపులో స్వర్ణలత

పోలీసుల అదుపులో స్వర్ణలత

పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. అతని మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించారు. స్వర్ణలతను పోలీసులు అదుపులోకి తీసుకొని, విచారించారు.

English summary
In a shocking incident, a woman bobbitised her husband leading to his death on the intervening night of Friday and Saturday in Guntur district. The victim was opposed to the alleged illicit relationship of his wife which led to the killing, police said. The incident took place in Sirangipalem of Phirangipuram mandal in the district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X