వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్‌తో పొత్తుకు సిపిఎం తహతహ: గుత్తా

By Pratap
|
Google Oneindia TeluguNews

Gutta Sukhender Reddy
నల్లగొండ/ వరంగల్: అవినీతికి రారాజైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో పొత్తు పెట్టుకోవడానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు తహతహలాడుతున్నారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

తెలంగాణపై సిపిఎం వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని ఆయన నల్లగొండ జిల్లా మిర్యాలగుడాలో డిమాండ్ చేశారు. కేంద్రం తెలంగాణ ఇస్తే అభ్యంతరం లేదని గతంలో చెప్పిన బివి రాఘవులు ఇప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా ఓటు వేస్తామనడం సరి కాదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.

రాష్ట్రాన్ని దోచుకోవడం కోసమే వైయస్ జగన్ హైదరాబాదులో సమైక్య సభ నిర్వహిస్తున్నారని తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి బసవరాజు సారయ్య అన్నారు. తండ్రి మాటపై విశ్వాసం లేని జగన్ మాటలను సీమాంధ్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన ఆదివారం వరంగల్‌లో అన్నారు. సమైక్య రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు కోరడం లేదని ఆయన అన్నారు.

తెలంగాణ అంశంపై కాంగ్రెసు పార్టీ కచ్చితంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. యూ టర్న్ తీసుకున్న నేతలను ప్రజలు గమనిస్తున్నారని, వారికి గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు తెలంగాణ ప్రాంతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కనుమరుగైందని ఆయన అన్నారు. ఆ పార్టీలో కొనసాగితే తల్లిదండ్రులు కూడా క్షమించరని ఆయన అన్నారు.

English summary
Congress Telangana region MP Gutta Sukhender Reddy has lashed out at CPM saying trying tp forge alliance with YS Jagan's YSR Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X