జగన్,పవన్లు.. నాన్సెన్స్, మంత్రులు, ఎమ్మెల్యేలపై బాబు ఫైర్, హోదాపై ఇక సమరమే
అమరావతి: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్లు నాన్సెన్స్లు సృష్టిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బాబు సంకేతాలిచ్చారు. సమావేశానికి ఏడుగురు మంత్రులు గైరాజర్ కావడం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల గ్రూపు వివాదాలపై బాబు వార్నింగ్ ఇచ్చాడు.
ఆల్పార్టీ మీటింగ్తో బాబు డ్రామాలు, బాబుకు ఏడు ప్రశ్నలు, పవన్ ఏం చేశాడు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పార్టీ ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు. టిడిఎల్పీ సమావేశాన్ని చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టిడిపి చేసిన కృషిని ప్రజలకు వివరించాలని సూచించారు. విపక్షాలు టిడిపిపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ ప్రజాప్రతినిధులకు బాబు సూచించారు.