వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు..! కొత్త యేడాది కొత్త పాల‌న‌కు శ్రీ‌కారం చుడుతుంద‌న్న‌ జ‌గ‌న్..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : నూత‌ల సంవ‌త్స‌రం ప‌ట్ల వైసీపి అదినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆశాభావంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది. కొత్త సంవ‌స్త‌రంలో కొత్త పాల‌న‌కు శ్రీ‌కారం జరుగుతుంద‌ని జోష్య చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2019 తెలుగు ప్రజలకు ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, సంపద, సమృద్ధి కలుగాలని శ్రీ వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది.

ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ ప్రజల జీవితాల్లో మంచి మార్పులకు దారి తీయాలని ఆయన కోరుకున్నారు. ఈ నూతన సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లో సుపరిపాలన అందుతుందని, విలువలు లేని అవకాశవాదుల నుంచి రాష్ట్రానికి విముక్తి కలుగుతుందన్నారు. రాజకీయాల్లో, పరిపాలనలో కొత్త ధోరణికి నూతన సంవత్సరం శ్రీకారం చుడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Happy New Years Greetings..! Jagans hope on new years new government..!!

సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి హృదయాన్ని స్పృశించేలా ఉంటాయన్నారు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఎంతో ఆశావ‌హ ద్రుక్ప‌దంతో విడుద‌ల చేసిన జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న పై ఏపి లో పెద్ద చ‌ర్చ జ‌రుగుతున్నట్టు తెలుస్తోంది. శుభాకాంక్ష‌ల‌కే ప‌రిమిత‌మైతే ఇంత చ‌ర్చ ఉండేదికాద‌ని, అందులో రాజ‌కీయ ప్ర‌మేయం ఉండే స‌రికి పొలిటిక‌ల్ గా పెద్ద చ‌ర్చ‌కు తావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

English summary
YSRCP Chief Jagana mohan reddy wanted to make good changes in the life of Andhra people this year. This New Year will be good in Andhra Pradesh and will be relieved from the unpopular opportunists of the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X