పుట్టిందే అలా: చంద్రబాబు నిర్ణయంపై స్పందించిన హరికృష్ణ
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీసుకన్న నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి హరికృష్ణ స్పందించారు. ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
కేంద్రంపై టిిపి అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడాన్ని తాను స్వాగతిస్తన్నట్లు తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని, రాష్ట్ర ప్రయోజనాలే టిడిపికి ముఖ్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులను కాపాడే విషయంలో రాజీ పడేది లేదని ఆయన అన్నారు.
కాగా, ఎన్డీఎతో తెలుగుదేశం పార్టీ తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్డీఎ నుంచి వైదొలుగుతూ శుక్రవారం నిర్ణయం తీసుకున్న టిడిపి ఆ తర్వాత విడిగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి సిద్ధపడింది.
కాగా, అవిశ్వాస తీర్మానానికి టిడిపి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తోంది. వివిధ పార్టీలు మద్దతు ప్రకటించడానికి ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. పలు పార్టీలు చంద్రబాబుకు మద్దతుగా నిలిచేందుకు ముందుకు వస్తున్నాయి.