హర్షకు బెయిల్, కిరణ్-లగడపాటి వల్ల బాబు సిఎం: దేవినేని ఆసక్తికర వ్యాఖ్య
రాజమండ్రి/విజయవాడ: మాజీ పార్లమెంటు సభ్యుడు హర్ష కుమార్కు హైకోర్టు మంగళవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. రాజమండ్రిలో క్రైస్తవులకు స్మశాన వాటిక కోసమంటూ హర్షకుమార్ కొద్ది రోజుల క్రితం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
స్మశాన వాటిక కోసం స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ హర్ష కుమార్ చేస్తున్న నిరీహార దీక్షను పోలీసులు పుష్కరాలకు ముందు శనివారం రాత్రి భగ్నం చేశారు. తనను తీసుకు వెళ్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ, ఆయన తుపాకీతో నాలుగు రౌండ్లు గాల్లోకి పేల్చాడు.
పరిస్థితి విషమిస్తుండటంతో స్పెషల్ పార్టీ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. తీవ్ర ఉద్రిక్తత మధ్య హర్ష కుమార్ అనుచరులను పక్కకు తప్పించారు. హర్ష కుమార్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తుపాకీనీ స్వాధీనం చేసుకున్నారు. కేసు పెట్టి అరెస్టు చేశారు. ఇప్పుడు బెయిల్ వచ్చింది.

కష్టకాలంలో పార్టీని వదిలేశారు, చరిత్రహీనులు: దేవినేని
కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లిన నేతలు చరిత్రహీనులు అని పిసిసి ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ మంగళవారం మండిపడ్డారు.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు వంటి వారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేందుకు సహకరించారని ఆరోపించారు. గోదావరి పుష్కరాల్లో 27 మంది మృతి చెందినా ఘనంగా నిర్వహించామని చెప్పుకోవడం విడ్డూరమన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications