చంద్రబాబే ముందు: లోకేష్ ఎదుట తండ్రిని ఆకాశానికెత్తిన శివనాడర్
హెచ్సీఎల్ చైర్మన్ శివనాడర్ శుక్రవారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు అని కొనియాడారు. అందరికంటే ముందే ఐటీ రంగాన్ని ప్రోత్సహించారన్నారు.
ఢిల్లీ: హెచ్సీఎల్ చైర్మన్ శివనాడర్ శుక్రవారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు అని కొనియాడారు. అందరికంటే ముందే ఐటీ రంగాన్ని ప్రోత్సహించారన్నారు.
జగన్ను నమ్మితే, ఇంత పని చేస్తారా: మంత్రి సుజయ కృష్ణ ఆగ్రహం
ఏపీ ఐటీ, పంచాయతీ రాజ్శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ రోజు శివనాడార్ను ఢిల్లీలో కలిశారు. నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతిలో అభివృద్ధి గురించి ఆయనకు వివరించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ప్రభుత్వ రాయతీలు, సింగిల్ విండో విధానంలో అనుమతులపై ఆయనకు లోకేశ్ వివరించారు. లోకేష్-శివనాడర్ సమక్షంలో ప్రభుత్వం, హెచ్సిఎల్ మధ్య ఒప్పందం జరిగింది. హెచ్సిఎల్ ఏర్పాటుకు అనుమతి పత్రాలను శివనాడర్ అందించారు.
ఈ సందర్భంగా శివనాడార్ మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ రంగాన్ని ఎంతగానో ప్రోత్సహించారన్నారు. ప్రపంచవ్యాప్తంగా పర్యటించి అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఐటీహబ్గా మార్చారన్నారు.తాను చంద్రబాబును కలిసిన ప్రతిసారీ రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి గురించే మాట్లాడేవారని గుర్తుచేసుకున్నారు.