అతడు జగన్కు వీరాభిమాని...ఇలా ఎందుకు చేశాడో?:నిందితుడు శ్రీనివాస్ సోదరుడి వెల్లడి
Recommended Video
తూర్పుగోదావరి: వైసిపి అధినేత వైఎస్ జగన్పై దాడిచేసిన తన తమ్ముడు శ్రీనివాస్ జగన్కు వీరాభిమాని అని అతడి సోదరుడు వెల్లడించారు. అలాంటిది అతడే ఇలా జగన్ పై దాడి చేశాడంటే నమ్మలేకపోతున్నానన్నారు.
జగన్ పై అభిమానంతో సంక్రాంతి పండగ సందర్భంగా ఆరడుగుల జగన్ కటౌట్ ఏర్పాటు చేసిన తన సోదరుడే ఇలా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదన్నారు. అయితే తన సోదరుడు శ్రీనివాస్ మానసిక ఆరోగ్యం సరిగానే ఉందని, అతడికి ఎలాంటి సమస్యాలేదన్నారు. నిందితుడు శ్రీనివాస్ ది తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం ఠానేలంకగా గుర్తించిన సంగతి తెలిసిందే.
జగన్పై కత్తితో దాడి చేసిన శ్రీనివాస్: అతని సోదరుడు ఏమన్నారో చూడండి..#YSJagan #YSRCP #JaganAttacked #Jagan pic.twitter.com/7p94yTQw3G
— Oneindia Telugu (@oneindiatelugu) October 25, 2018
తమది చాలా పేద కుటుంబమని, పనిచేసుకుంటే గానీ పూటగడవని పరిస్థితి అని...ఇలాంటి పరిస్థితుల్లో తన సోదరుడు ఎందుకిలా చేశాడో అర్థంకావడంలేదంటూ శ్రీనివాస్ సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు. తన సోదరుడుడు ఏడాదికాలంగా విశాఖపట్టణం విమానాశ్రయంలో ఓ హోటల్లో వెయిటర్గా పనిచేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.
ఇదిలావుంటే ప్రతిపక్ష నేత జగన్పై విశాఖ ఎయిర్పోర్టులో జరిగిన దాడి ఘటనను ఏపీ డీజీపీ ఆర్పీ రాకూర్ మీడియాకు వివరించారు. ''మధ్యాహ్నం 12 గంటలకు జగన్ వీఐపీ లాంజ్కు వచ్చారు. అక్కడి సర్వర్ అందరికీ టీ ఇచ్చాడు. 2.30 గంటలకు మళ్లీ కాఫీ ఇచ్చాడు. ఆ తర్వాత జగన్తో సెల్ఫీ దిగాలని అడిగాడు. ఎడమ చేతితే సెల్ఫీ తీసుకుంటూనే.. కుడి చేతితో జేబులో నుంచి కత్తి తీశాడు. కత్తితో జగన్ ఎడమ భుజంపై దాడి చేశాడు".
దీంతో అక్కడున్న సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దినేశ్కుమార్తో పాటు జగన్ గన్మెన్లు వెంటనే స్పందించి అడ్డుకున్నారు. దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని సీఐఎస్ఎఫ్ అధికారులకు అప్పగించారు. దాడి చేసిన వ్యక్తి జగన్ అభిమాని అని తెలిసిందని, పబ్లిసిటీ కోసమే అతడు దాడిచేసినట్లు అనిపిస్తోందని ఆయన చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరగుతోంది...విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని డిజిపి ఈ సందర్భంగా తెలిపారు.