విధ్యార్థినులకు స్పెషల్ క్లాసులు, లైంగిక వేధింపుల కోసమే ఇలా....
ప్రత్యేక క్లాసుల పేరుతో విధ్యార్థినులను ప్రధానోపాధ్యాయుడు లైంగికంగా వేధిస్తున్నాడు.ఈ విషయం వెలుగు చూడడంతో గ్రామస్థులు ప్రధానోపాధ్యాయుడిని చితకబాదారు.ఎంఈఓ ఈ ఘటనపై వివరాలు సేకరించారు.
తొండంగి:ప్రత్యేక క్లాసుల పేరుతో విధ్యార్థినులను ప్రధానోపాధ్యాయుడు లైంగికంగా వేధిస్తున్నాడు. ఎట్టకేలకు ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. దీంతో ప్రధానోపాద్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఎవినగరం ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకొంది.
భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే విధ్యార్థులను లైంగికంగా వేధిస్తున్నారు. అయితే ప్రత్యేక తరగతుల పేరుతో విధ్యార్థినులను వేధిస్తున్నాడు తొండంగి మండలం ఏవీ నగరం ప్రాథమికోన్నత పాఠశాలలో ఆదివారం ఓ ఉపాధ్యాయుడు ప్రత్యేక తరగతుల పేరిట విధ్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నాడు.
ఏవీ నగరం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ఉప్పాడ కొత్తపల్లి గ్రామానికి చెందిన పెంకె రామచంద్రరావు బాద్యతలు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా పాఠశాలలో ఆదివారం నాడు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
ప్రత్యేక తరగతులకు అందరూ విధ్యార్థినులను మాత్రమే పిలవకుండా కొందరిని మాత్రమే పిలుస్తున్నాడు.దీంతో గ్రామస్థులకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన గ్రామస్థులు కొందరు విధ్యార్థినులను ఆరా తీస్తే అసలు విషయం వెలుగుచూసింది. విధ్యార్థులను లైంగిక వేధింపులకు గురిచేసేందుకు ప్రధానోపాధ్యాయుడు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాడని విధ్యార్థినులు చెప్పారు.
అయితే ప్రత్యేక తరగతులను సెలవు రోజుల్లో నిర్వహించనని ప్రధానోపాద్యాయుడు గ్రామస్థులకు క్షమాపణ పత్రం రాసిచ్చాడు.అయితే మంగళవారం నాడు ప్రధానోపాధ్యాయుడిని స్కూల్లోనే స్థంబానికి కట్టేసి దేహశుద్ది చేశారు గ్రామస్థులు.
ఈ ఘటనపై పోలీసులకు గ్రామస్థులు సమాచారం ఇచ్చారు.అయితే పోలీసులు ఎంఇఓను అదుపులోకి తీసుకొన్నారు.ఈ విషయమై ఎంఇఓ షేక్ బాబ్జీ పాఠశాల వద్దకు చేరుకొని వివరాలు ఆరా తీశారు.