వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం: భారీ వర్షాలు, మత్స్యకారులకు హెచ్చరిక
విశాఖపట్నం: మరో రెండ్రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది దీంతో రానున్న 12గంటల్లో వాయుగుండంగా, అనంతరం తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
వాయుగుండం ప్రభావంతో దక్షిణ, మధ్య బంగాళాఖాతం తీరం వెంబడి బుధవారం సాయంత్రం నుంచి గంటకు 45-55కిలోమీటర్ల వేగంతో, గురువారం నుంచి 65-75 కిలోమీటర్ల వేగంతోనూ గాలులు వీస్తాయని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది.
మత్స్యకారులు దక్షిణ బంగాళాఖాతం, ఒడిశా, అండమాన్, ఆంధ్రప్రదేశ్ తీరం రెండ్రోజులపాటు వెళ్లరాదని చెన్నై వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Comments
heavy rains andhra pradesh depression bay of bengal rains భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ అల్పపీడనం బంగాళాఖాతం వర్షాలు మత్స్యకారులు
English summary
Andhra Pradesh has been recording on and off good rains for past many days. As per weather data, Coastal Andhra Pradesh has been recorded some good rain and thundershowers, while Rayalseema which has been dry has also started recording moderate to heavy showers during the last two to three days.
Story first published: Wednesday, September 19, 2018, 18:26 [IST]