ఇంటర్ విద్యార్థి హేమకు బాబు బంపర్ ఆఫర్, నేతలకు హితవు
మహానాడు వేదికపై ఇంటర్ విద్యార్థిని చేసిన ప్రసంగం చంద్రబాబునాయుడు సహా పలువురు పార్టీనేతలను ఆకట్టుకొంది. ఇక నుండి ఏవేదికపైనైనా మాట్లాడేందుకు ఆమెకు అవకాశం కల్పిస్తున్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు.
విశాఖ: మహానాడు వేదికపై ఇంటర్ విద్యార్థిని చేసిన ప్రసంగం చంద్రబాబునాయుడు సహా పలువురు పార్టీనేతలను ఆకట్టుకొంది. ఇక నుండి ఏవేదికపైనైనా మాట్లాడేందుకు ఆమెకు అవకాశం కల్పిస్తున్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీ మహానాడులో విశాఖ జిల్లా తుమ్మలపాలెం కు చెందిన హేమమాలిని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రభుత్వ పథకాలు, పోలవరం ప్రాజెక్టు, ముఖ్యమంత్రిగా బాబు పాలనాదక్షత, విపక్షాలతీరును ఆమె తన ప్రసంగంలో వివరించారు.
మహానాడులో పాల్గొన్నవారెవరికీ కూడ విసుగు లేకుండా ఆమె తన ప్రసంగించారు. మద్య మద్యలో విమర్శలు, చెణుకులు విసురుతూ ఆమె ప్రసంగించారు.
దీంతో ఆమె ప్రసంగాన్ని సభికులు ఆసక్తిగా విన్నారు. ఈ ప్రసంగానికి చంద్రబాబునాయుడు ముగ్దుడయ్యాడు. ఆమెను చూసి పార్టీ నాయకులంతా నేర్చుకోవాలని బాబు సూచించారు.ఇకపై ఏ వేదికపైనా అయినా ప్రసంగించే హక్కును ఆమెకు కల్పిస్తున్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు.