బిజెపిలోకి హీరో రాజశేఖర్, జీవిత దంపతులు?
దేశంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రభంజనం వీస్తుందనే ఆలోచనతో వారు ఉన్నారని, దాంతో వారు బిజెపిలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్లో చేరిన జీవిత, రాజశేఖర్ దంపతులు వైయస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. అయితే ఎక్కువ కాలం అక్కడ ఇమడలేకపోయారు. దీంతో వారు బయటకు వచ్చారు.
వారు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగింది. రాష్టవ్రిభజన నిర్ణయం నేపథ్యంలో కాంగ్రెసు పార్టీలో చేరడానికి వారు సిద్ధంగా లేరని అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో కూడా చేరడానికి వారు ప్రయత్నాలు చేశారు. అయితే, అది సాధ్యం కాలేదు.
నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో రాజశేఖర్ దంపతులు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కూడా బిజెపి బలం పుంజుకుంటోందని వారు అనుకుంటున్నట్లు సమాచారం.