రూ.170 కోట్ల జగన్ ఆస్తుల కేసు: మా వాదనలు విన్లేదని ఈడీ, డివిజన్ బెంచ్ తీర్పు
జగన్ ఆస్తుల కేసులో ఈ నెల 31వ తేదీ వరకు యథాతథ స్థితి కొనసాగించాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది.
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల జఫ్తు పైన సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ను ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) ఆశ్రయించింది.
రూ.170 కోట్లు ఈడీ ఖాతాలోకి: హైకోర్టుకు వైయస్ భారతి, జగన్కు ఊరట
ఆ అప్పీళ్ల పైన హైకోర్టు గురువారం నాడు తీర్పు వెల్లడించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును నిలుపుదల చేస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
భారతీ సిమెంట్స్ వ్యవహారంలో వైయస్ జగన్ సతీమణి భారతి, కంపెనీకి సంబంధించిన ఆస్తుల స్వాధీనంపై అప్పీలేటింగ్ అథారిటీలో తేలే వరకు ఆస్తులు స్వాధీనం చేసుకోవద్దని గతంలో సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.
ఈ వాదనను ఈడీ కొట్టి పారేస్తూ తాము చెప్పిన వాదనలు వినకుండా ఏకపక్షంగా సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారని డివిజన్ బెంచ్కు ఈడీ అప్పీల్ చేసింది.
జగన్కు షాక్, అసాధారణ నిర్ణయం: రూ.170 కోట్లు ఈడీ ఖాతాలోకి, దిగ్భ్రాంతి
ఈ నేపథ్యంలో ఈ నెల 31వ తేదీ వరకు యథాతథ స్థితి కొనసాగించాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది. తీర్పును పునఃసమీక్షించాలని సింగిల్ జడ్జికి హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. సింగిల్ బెంచ్ తీర్పును నిలిపివేసింది. అప్పటి దాకా యథాతథ స్థితి ఉండనుంది. కాగా, జగన్కు చెందిన రూ.170 కోట్లను ఈడీ తమ ఖాతాలోకి మళ్లించుకుంది.