వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ రీ నోటిఫికేషన్ పై విచారణ వాయిదా.. కౌంటర్ దాఖలుకు ఎస్ఈసికి ఆదేశం

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలను గతంలో నిలుపుదల చేసిన దగ్గర నుండి నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫిబ్రవరి 18న ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చింది. దీనిపై ఏపీ లోని ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని, పాత ఎన్నికలను పూర్తిగా రద్దు చేసి, కొత్త ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేశాయి. కోర్టు మెట్లెక్కాయి.

Recommended Video

MPTC & ZPTC Polls జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు ఎస్ఈసీ కీల‌క ఆదేశాలు.. బలవంతపు నామినేషన్ల ఉపసంహరణలు చెల్లవు

విశాఖలో విజయసాయి వర్సెస్ నారా లోకేష్ ... కాక రేపుతున్న కార్పోరేషన్ ఎన్నికల ప్రచారంవిశాఖలో విజయసాయి వర్సెస్ నారా లోకేష్ ... కాక రేపుతున్న కార్పోరేషన్ ఎన్నికల ప్రచారం

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రతిపక్షాల డిమాండ్

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రతిపక్షాల డిమాండ్


రాష్ట్ర ఎన్నికల కమిషన్ గతేడాది ఇచ్చిన నోటిఫికేషన్ ఇంకా మనుగడలో ఉందని, కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాదని, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత దానిని ప్రశ్నించడానికి వీలు లేదని చెప్పి గత ఎన్నికలకు కొనసాగింపుగా ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ నే కొనసాగించడంపై ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నామినేషన్ల ప్రక్రియ అధికార పార్టీ నాయకుల బెదిరింపులు, కిడ్నాప్ లతో గందరగోళంగా జరిగిందని వారు ప్రధానంగా ఆరోపించారు.

కోర్టు మెట్లెక్కిన ప్రతిపక్షాలు .. విచారించిన కోర్టు

కోర్టు మెట్లెక్కిన ప్రతిపక్షాలు .. విచారించిన కోర్టు

దీనిపై హైకోర్టులో పదకొండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల నిర్వహణకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని దాఖలైన పిటిషన్లపై ఇప్పటికే విచారణ జరిపిన హైకోర్టు ఈరోజు మరోమారు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ రీ నోటిఫికేషన్ వ్యవహారంపై విచారణ జరిపింది. రీ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు అటు పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు , రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది వాదనలు విన్నది.

కౌంటర్ అఫిడవిట్ దాఖలుకు సమయం కోరిన ఎస్ఈసి .. కేసు మార్చి 8వ తేదీకి వాయిదా

కౌంటర్ అఫిడవిట్ దాఖలుకు సమయం కోరిన ఎస్ఈసి .. కేసు మార్చి 8వ తేదీకి వాయిదా

జనసేన కార్యదర్శితో పాటుగా పలువురు పిటిషన్లు దాఖలు చేసిన ఈ కేసులో గతంలో నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా అధికార పార్టీకి చెందిన వారు తమ నామినేషన్లు వేయకుండా బలవంతంగా అడ్డుకున్నారని పిటిషనర్లు పేర్కొన్నారు. గత విచారణలో దీనిపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయవలసిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. అయితే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చెయ్యని అధికారులు , కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడం కోసం సమయం కావాలని ఎన్నికల సంఘం ఏపీ హైకోర్టు కు విజ్ఞప్తి చేసింది. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది.

English summary
The High Court, which was hearing the petition seeking re-notification of the MPTC and ZPTC elections, heard arguments on behalf of the petitioner and counsel on behalf of the State Election Commission. The court directed the state election commission to file a counter affidavit on the matter at the last hearing. However, the Election Commission has appealed to the AP High Court to allow time for the officials who have not filed the counter affidavit to file the counter affidavit. The High Court adjourned the case till May 8
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X