ఆ గుడిలో చంద్రబాబే దేవుడు:తమ అభిమాన నేతకు ఆలయాన్ని నిర్మిస్తున్న హిజ్రాలు
నంద్యాల:ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్లకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మాట నిలబెట్టుకున్నారు...తమ మొర ఆలకించి తమ విన్నపాలన్నీ మన్నించిన సిఎంకు కృతజ్ఞతగా గుడి కడతామని వాళ్లు ప్రమాణం చేశారు. ఆ ప్రకారం వాళ్లు కూడా తమ ప్రమాణం నెరవేర్చేందుకు సంసిద్దమయ్యారు.
ఇంతకీ వాళ్లెవరంటే...హిజ్రాలు...తమ కోసం ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమల్లోకి తెచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు హిజ్రాలు నంద్యాలలో గుడి కడుతున్నారు. ఈ ఆలయం నిర్మాణానికి మంత్రి అఖిలప్రియ, ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి శంకుస్థాపన చేశారు. హిజ్రాలకు ఆధార్, రేషన్ కార్డ్ లతో పాటు నెలకు రూ.1500 పెన్షన్ ఇస్తామన్న సీఎం హామీతో వారు ఈ చంద్రబాబుకు ఈ గుడి నిర్మాణం చేపట్టారు.
హిజ్రాలు తలపెట్టిన ఈ ఆలయ నిర్మాణానికి అభిరుచి మధు, ఎంపీ టీజీ వెంకటేశ్, మంత్రి అఖిలప్రియ సహకరిస్తున్నారు. ఈ గుడిలో ప్రతిష్టించేందుకు 10 కేజీల వెండితో ప్రత్యేకంగా చంద్రబాబు విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు.