హైదరాబాద్ స్టార్ హోటళ్లలో హైటెక్ వ్యభిచార ముఠా: నిర్వాహకురాలు ముంబై మహిళ
హైదరాబాద్: హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును హైదరాబాదులోని గచ్చిబౌలి పోలీసులు రట్టు చేశారు. స్టార్ హోటళ్లలో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ఎనిమిది మంది సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
గచ్చిబౌలి సిఐ జె రమేష్ కుమార్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. - ముంబైకి చెందిన సిమ్రాన్ బేగం (32) అలియాస్ అలిసా బేగం కొన్నేళ్లుగా హైదరాబాదులో నివాసం ఉంటోంది.
ఆమె కొండాపూర్ శ్రీరాంనగర్లోని ఓ అపార్టుమెంటులో ఫ్లాట్ను అద్దెకు తీసుకుంది. గత నాలుగేళ్లుగా ఆమె ఆన్లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తోంది. సైబరాబాద్ ఎస్టీవో పోలీసులు, గచ్చిబౌలి పోలీసులు శుక్రవారం రాత్రి ఫ్లాట్పై దాడి చేశారు.
ప్రధాన నిందితురాలు సిమ్రాన్తో పాటు ఢిల్లీకి చెందిన డింపుల్ (27), అబ్దుల్ సమద్ (42), కరీంనగర్కు చెందిన షేక్ యాసిన్ (20), షేక్ మోసిన్ (20), డ్రైవర్లుగా పనిచేసిన ఎండి షకీల్ (23), అబ్దుల్ అజీజ్ (23), విశాఖపట్నం తాళ్లపాలెంకు చెందిన వంట మనిషి సంధ్య (35)లను అరెస్టు చేసి శనివారంనాడు రిమాండ్కు తరలించారు.
నిందితుల నుంచి అసెంట్, ఇండికా కార్లు, 20 సెల్ ఫోన్లు, 9 సిమ్ కార్డులు, ల్యాప్ టాప్, బ్యాంక్ పాస్ బుక్లను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర బ్యాంక్ ఖాతాలో రూ.2.50 లక్షలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. బ్యాంకులోని డబ్బును కోర్టుకు అప్పగిస్తామని చెప్పారు. ఫ్లాట్ యజమానికి నోటీస్ జారీ చేయనున్నట్లు తెలిపారు. అతని వివరణ సంతృప్తికరంగా లేకపోతే ఫ్లాట్ను సీజ్ చేస్తామని అన్నారు.