తూ.గోలో హనీట్రాప్... యువతితో కలిసి డబ్బులు దోచుకుంటున్న గ్యాంగ్...
హనీట్రాప్ .. డబ్బున్న వాళ్లకు వలపు వల విసిరి వారిని బ్లాక్మెయిల్ చేయడం.. సమాజంలో గౌరవం మర్యాద ఉన్నవారిని సెలక్ట్ చేసుకుని వారితో సన్నిహితంగా ఉండి, అందుకు సంబంధించి విడీయోలు తీసి, చివరకు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజడం వారి లక్ష్యం. ఇలాంటీ హనీ ట్రాప్లు మెట్రో నగరాల్లో ముఖ్యంగా ఆర్ధిక రాజధాని ముంబయి, ఢిల్లీ లాంటీ నగరాలతోపాటు హైదరాబాద్లో కూడ జడలు విప్పుతుంది.
ప్రస్తుతం ఇలాంటీ సంఘటనలు ఆయా జిల్లాలో కూడ కొనసాగుతున్నాయి. అయితే ఇందులోకి దిగుతున్న వారు భార్యభర్తలు కావడం విశేషం. ఇటివల ఈనేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కనిష్క, మరియు విజయవాడకు చెందిన విజయ్ దంపతులు హైదరాబాద్ గచ్చిబౌలీలో నివాసం ఉంటు హనీట్రాప్కు తెర తీసిన విషయం మరవక ముందే అదే జిల్లాకు చెందిన వారు మరో హనీ ట్రాప్కు తెర లేపారు.
ఈ నేపథ్యంలోనే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ గ్యాంగ్ యువతిని ఉపయోగించుకుని ఇలాంటీ హనీట్రాప్లు చేస్తున్నారు. అనంతరం ట్రాప్లో చిక్కుకున్న వారిని బెదిరించి డబ్బులు గుంజుతున్నారు. ఇలా హనీ ట్రాప్ చేస్తున్న యువతితో పాటు ఏడుగురు గ్యాంగ్ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ వివరాల్లోకి వెళితే...ముఠాకు చెందిన రాకేష్ మరియు అతని భార్య అశ్వినీలు... జిల్లాకు చెందిన మణికంఠరెడ్డి అనే వ్యక్తిని ట్రాప్ చేయించారు.. అతడితో పరిచయం పెంచుకునేలా పథకం రచించారు.
ఈ క్రమంలో యువతి మరియు మణికంఠరెడ్డిలు సన్నిహితంగా ఉన్నప్పుడు ముఠాకు చెందిన వ్యక్తులు వీడియోలు చిత్రీకరించారు. అనంతరం నగ్న వీడియోను చూపించి మణికంఠను బెదిరించడం మొదలుపెట్టారు. ఆయన దగ్గర కొన్ని డబ్బులతోపాటు కొంత బంగారాన్ని దోచుకున్నారు.
ఈ నేపథ్యంలోనే మణికంఠరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ముఠాకు చెందిన రాకేష్తో పాటు వారికి సహకరించిన ఏడుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. కాగా వీరంతా జిల్లాలోని కాకినాడకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.