ఫేస్బుక్ పరిచయం: కూతుర్ని ప్రేమించాడని చంపేసిన తండ్రి
తెలుగు రాష్ట్రాల్లో మరో పరువు హత్య వెలుగు చూసింది. తూర్పు గోదావరి జిల్లా మల్కిపురంలో ఈ దారుణం చోటు చేసుకుంది. కూతుర్ని ప్రేమించాడని ఆమె తండ్రి ఓ యువకుడ్ని చంపేసి, గోతిలో పాతి పెట్టారు.
రాజమహేంద్రవరం: తెలుగు రాష్ట్రాల్లో మరో పరువు హత్య వెలుగు చూసింది. తూర్పు గోదావరి జిల్లా మల్కిపురంలో ఈ దారుణం చోటు చేసుకుంది. కూతుర్ని ప్రేమించాడని ఆమె తండ్రి ఓ యువకుడ్ని చంపేసి, గోతిలో పాతి పెట్టారు.
స్వాతితో ఫోన్లో మాట్లాడి: కేసులో దెబ్బ!
ఈ విషయం పోలీసుల విచారణలో వెల్లడయింది. కొద్ది రోజులుగా మృతుడు రామాంజనేయులు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పలు కోణాల్లో విచారించి, యువతి తండ్రే చంపేసినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు.
నిందితుడిని విజయ్ కుమార్గా గుర్తించారు. ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. విజయ్ కుమార్ కూతురు, మరో పక్క గ్రామానికి చెందిన యువకుడు రామాంజనేయులుకు ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారిందని చెబుతున్నారు.
ఈ విషయం విజయ్ కుమార్కు తెలిసింది. దీంతో అతను రామాజనేయులును హత్య చేసి కరవాడ బీచ్లో పాతిపెట్టాడని తెలుస్తోంది. అయితే, అమ్మాయి, మృతుడు.. ఇరువురు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం.
మరోవైపు, నిందితుడు విజయ్ కుమార్ గ్రామానికి చెందిన కొందరు మరో వాదన వినిపిస్తున్నారు. రామాంజనేయులు, యువతి మధ్య ప్రేమ లేదని, అతను నిత్యం వేధించేవాడని చెబుతున్నారు.