గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నారా లోకేష్ కు తృటిలో తప్పిన ప్రమాదం: ఊడి పడ్డ హోటల్ బోర్డు

|
Google Oneindia TeluguNews

Recommended Video

లోకేష్ కు తృటిలో తప్పిన ప్రమాదం...!! | Oneindia Telugu

గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన.. ప్రచార కార్యక్రమాల్లో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా లోకేష్, గుంటూరు టీడీపీ లోక్ సభ అభ్యర్థి గల్లా జయదేవ్ సహా పలువురు నాయకులు మంగళవారం రాత్రి నిడమర్రుకు వెళ్లారు.

hotel board collapses in nara lokesh elections campaign at nidamarru in mangalagiri

అక్కడ సద్గుణ టిఫిన్ సెంటర్ వద్ద నిల్చుని ప్రసంగిస్తూ ఉండగా.. అదే హోటల్ పేరు రాసి ఉన్న బోర్డు ఆయనపై పడింది. లోకేష్ తో పాటు పక్కనే ఉన్న ఇతర నాయకులపైనా బోర్డు విరిగి పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు తగల్లేదు. దీనితో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ లా మారింది.

ఆత్మ‌గౌర‌వం కాపాడుకుందాం : కుట్ర‌ల‌ను తిప్పి కొడుదాం: సీయం చంద్ర‌బాబు పిలుపు..!ఆత్మ‌గౌర‌వం కాపాడుకుందాం : కుట్ర‌ల‌ను తిప్పి కొడుదాం: సీయం చంద్ర‌బాబు పిలుపు..!

English summary
TDP MLA Candidate from Mangalagiri Nara Lokesh narrowly escaped from an accident at Nidamarru village in Mangalagiri assembly constituency limits on Tuesday night. A Hotel name board collapsed on the crowd where Nara Lokesh stands and given Election speach. No body hurt from this incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X