భర్తకు కరోనా పాజిటివ్, క్వారంటైన్ కేంద్రంలో భార్య మృత్యువాత.. ఎలా అంటే..
కరోనా వైరస్ జడలు విప్పి నాట్యం చేస్తోంది. వైరస్ బారినపడి తగిన జాగ్రత్తలు తీసుకొకుంటే అంతే సంగతులు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకగా.. అతని భార్య క్వారంటైన్ కేంద్రంలో చనిపోయింది. భర్త ఆస్పత్రిలో ఉండగా.. ఇద్దరు పిల్లలు క్వారంటైన్ కేంద్రంలో అచేతనంగా ఉండిపోయారు. హృదయ విదారకర ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.
తెనాలి మండలం గంగానమ్మపేటలో ఓ కుటుంబం ఉంటోంది. అయితే భర్తకు కరోనా సోకింది. ఎలా వచ్చింది తెలియదు గానీ.. ఈ నెల 18వ తేదీన వైరస్ వచ్చినట్టు ఆరోగ్య కార్యకర్తలు నిర్దారించారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో వారిని తెనాలి మండలం జగ్గడిగుంటపాలెం క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ఆస్పత్రిలో ఉన్న భర్త.. వైరస్ కోసం చికిత్స తీసుకుంటున్నారు.
Recommended Video
ఇంతలో ఘోరం జరిగిపోయింది. క్వారంటైన్ కేంద్రంలో ఉన్న వివాహిత చనిపోయింది. ఆమెకు గుండెపోటు రావడంతో బుధవారం రాత్రి క్వారంటైన్ కేంద్రంలోనే మృతిచెందారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భర్త ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా.. పిల్లలు క్వారంటైన్ కేంద్రాలు ఉన్నారు. వివాహిత చనిపోయారని తెలిసి గుండెలవిసేలా రోదిస్తున్నారు.