టీడీపీలో చేరికపై స్పందించిన బుట్టా రేణుక
తాను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు వస్తోన్న వార్తలపై కర్నూలు ఎంపీ బుట్టా రేణుక స్పందించారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరబోవడం లేదని, వైసీపీలోనే కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు.
విజయవాడ: తాను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు వస్తోన్న వార్తలపై కర్నూలు ఎంపీ బుట్టా రేణుక స్పందించారు. తాను టీడీపీలో లో చేరుతున్నట్లు వస్తోన్న కథనాలకు తెరదించారు. తనపై ఓ పథకం ప్రకారం ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని రేణుక ఆరోపించారు.
చదవండి: టిిడిపిలోకి బుట్టా రేణుక సహాా ఐదుగురు వైసిపి ప్రజాప్రతినిధులు
తాను తెలుగుదేశం పార్టీలో చేరబోవడం లేదని, వైసీపీలోనే కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు. తాను వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటున్నానని, పార్టీ అధినేతతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆమె తేల్చి చెప్పారు.
మరోవైపు రాయలసీమ నుంచి టిడిపిలోకి భారీగా వలసలుంటాయంటూ టీవీ ఛానెళ్లలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. బుట్టా రేణుకతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ మాజీ ఎమ్మెల్యే కూడా టీడీపీలో చేరబోతున్నారంటూ కొన్ని వార్తా ఛానళ్లు బ్రేకింగ్ న్యూస్ కూడా ఇచ్చాయి.
జగన్ పాదయాత్ర ప్రారంభించేలోపే పలువురు వైఎస్సార్సీపీ నాయకులు.. తెలుగుదేశం పార్టీలోకి పెద్ద సంఖ్యలో చేరబోతున్నారని, దీనికి సంబంధించి రాయలసీమ ఎంపీలు కొందరు మధ్యవర్తిత్వం వహిస్తున్నారంని ఆయా ఛానళ్లు కథనాలు ప్రసారం చేశాయి. ఈ నేపథ్యంలో బుట్టా రేణుక స్పందించి స్పష్టతనిచ్చారు.