మోడీజీపై నమ్మకముంది.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారు: వైఎస్ జగన్ ఆశాభావం
అమరావతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇచ్చే విషయంలో ప్రధాని మోడీపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం మరోసారి విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ వైసీపీ ఢిల్లీలో సోమవారం భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే.
Recommended Video
జగన్ చేతకానితనం, వైఎస్ కుటుంబానికి ఓటమి శకం మొదలైంది: వీరశివారెడ్డి సంచలనం
వైసీపీ ఢిల్లీలో చేపట్టిన మహాధర్నాకు సీపీఐ, సీపీఎం, ఆప్ కూడా మద్దతు పలికాయి. దీనిపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఓ ట్వీట్లో స్పందించారు. 'ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా డిమాండ్ను ఢిల్లీకి తీసుకెళ్లే కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమైన నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు అందరికీ నా ధన్యవాదాలు..' అని పేర్కొన్నారు.
'అలాగే, ఈ ధర్నాలో పాల్గొన్న సీపీఐ, సీపీఎం, ఆప్ నాయకులు, శ్రేణులకు కూడా కృతజ్ఞతలు. నరేంద్ర మోడీజీ మన ఆందోళనలను తప్పకుండా పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక హోదా మంజూరు చేస్తారని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇది మన హక్కు కూడా..' అంటూ జగన్ ట్వీట్ చేశారు.