వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉద్యోగులపై నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా, నేను రాయలసీమ బిడ్డనే: చెవిరెడ్డి
ఉద్యోగులు, అధికారులపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు.ఉద్యోగ సంఘాలు అవివేకంతో మాట్లాడకూడదని ఆయన సూచించారు.
తిరుపతి: ఉద్యోగులు, అధికారులపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు.ఉద్యోగ సంఘాలు అవివేకంతో మాట్లాడకూడదని ఆయన సూచించారు.
తాను గాంధీని కాదన్నారు. రాయలసీమ బిడ్డనని చెప్పారు. తనకు పౌరుషం ఉంటుందన్నారు. తన మాటలు పదిశాతం మంది ఉద్యోగులకు వర్తిస్తాయన్నారు చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి చెప్పారు.
చంద్రబాబుహయంలో వైసీపీ నేతలను, కార్యకర్తలను ఇబ్బందిపెట్టిన అధికారులను వదిలిపెట్టేదిలేదన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.
గురువారం నాడు జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశంలో ఉద్యోగులపై పరుషపదజాలాన్ని వాడారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Comments
chevireddy bhaskar reddy apngo andhra pradesh ysr congress employees చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఏపీఎన్జీవో ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ కాంగ్రెస్ ఉద్యోగులు
English summary
I'm stuck on my words said Ysrcp MLA chevireddy Bhaskar Reddy on Friday. ApNGo leaders condemned Chevireddy comments.
Story first published: Friday, June 9, 2017, 22:00 [IST]