ఏడాదిలో ఓ మంచి అన్నయ్య ముఖ్యమంత్రిగా కూర్చుంటారు: జగన్
ఏడాదిలో మన ప్రభుత్వం వస్తుందని, ఓ మంచి అన్నయ్య మీ ముందు ముఖ్యమంత్రిగా ఉంటాడని వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం అన్నారు.
ధర్మవరం: ఏడాదిలో మన ప్రభుత్వం వస్తుందని, ఓ మంచి అన్నయ్య మీ ముందు ముఖ్యమంత్రిగా ఉంటాడని వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం అన్నారు.
ఆగండి! పార్టీ మారడంపై అన్నీ చెబుతా: బుట్టా రేణుక ఆసక్తికర వ్యాఖ్యలు
ఆయన ధర్మవరంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు దాటినా ఒక్క రైతుకు, నేతన్నకు మేలు జరగలేదన్నారు. చంద్రబాబుకు ఇప్పటికైనా జ్ఞానోదయం కావాలన్నారు.
టోపీలు పెట్టుకొని, హీరోలా ఫోజులు ఇచ్చి చంద్రబాబు రైతులను మోసం చేశారన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీల వల్లే నేతన్నలు ఇప్పుడు దీక్ష చేస్తున్నారని మండిపడ్డారు.
విద్యార్థులను, రైతులను, చేనేత కార్మికులను.. ఇలా అందరినీ చంద్రబాబు మోసం చేశారన్నారు. చంద్రబాబు చివరకు కులాలను కూడా వదలడం లేదన్నారు. ఏడాదిలో వైసిపి గెలిచి, మంచి అన్నయ్య సీఎం పీఠంపై కూర్చుంటారని చెప్పారు.