బాబుపై ప్రివిలేజ్మోషన్ పెడతా: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
అమరావతి: పిఎంఓపై, తనపై తప్పుడు ఆరోపణలు చేసిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై ప్రివిలేజ్ మోషన్ను పెట్టనున్నట్టు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు.శుక్రవారంనాడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.తాను ప్రధానమంత్రిని కలవడంపై అసెంబ్లీ సాక్షిగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తప్పుడు ఆరోపణలు చేశారని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు
కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..
ప్రధానమంత్రి కార్యాలయంపైనే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తప్పుబట్టారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. ప్రధాని కార్యాలయంతో పాటు, ప్రధానిని కూడ ఆయన తప్పుబట్టారని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజకీయ పార్టీలు, కూటములకు విడాకులు ఇవ్వడం, మళ్లీ మళ్లీ కలిసిపోవడం చంద్రబాబుకు అలవాటేనని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. అవినీతి, అక్రమాలు బయటపడతాయనే భయంతోనే తిరిగి బీజేపీతో రీయూనియన్ అయ్యేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని విజయసాయి రెడ్డి చెప్పారు. పార్లమెంట్ వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన
తన నాలుగేళ్ల పాలనలో చోటుచేసుకున్న అక్రమాలు, అవినీతి వ్యవహారాలు బయటపడతాయని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే బీజేపీకి తిరిగి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని విజయసాయి రెడ్డి విమర్శించారు.