బిజెపిలోకి నో: పనబాక, కిరణ్ చెప్పినా వినను: పంతం
కాగా, పనబాక లక్ష్మిని పలువురు సమైక్యవాదులు అడ్డుకున్నారు. దీంతో పనబాక వర్గీయులు ఎదురు దాడికి దిగారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తతత ఏర్పడింది.
సిఎం చెప్పినా వినను: పంతం గాంధీ
తాను రాజ్యసభ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థికి ఓటు వేయనని ఎమ్మెల్యే పంతం గాంధీ మోహన్ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినా తాను వినేది లేదన్నారు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి ఓటేస్తే ఇంకా సమైక్యానికి అర్థం ఏముంటుందని ప్రశ్నించారు.
కోరితే సంతకం చేశా: తుని ఎమ్మెల్యే
మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి కోరితే తాను సంతకం చేశానని కానీ, రాజ్యసభ ఎన్నికల్లో అధిష్టానం ఎవరి పేరు చెబితే వారికే ఓటేస్తానని తుని ఎమ్మెల్యే అన్నారు.
సోనియా ఆత్మహత్య చేసుకునే వారు: కెఈ
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలుగు వచ్చి ఉంటే సీమాంధ్రులు పెట్టిన శాపనార్థాలు విని ఎప్పుడో ఆత్మహత్య చేసుకునే వారని తెలుగుదేశం పార్టీ నేత కెఈ అన్నారు. కొత్త రాజధానికి ఆర్థిక వనరులు ఎక్కడి నుండి వస్తాయో చెప్పాలని ప్రశ్నించారు.