ఆపకుంటే రాజీనామా చేస్తా: చంద్రబాబుకు వైసిపి ఎమ్మెల్యే ఈశ్వరి హెచ్చరిక
విశాఖ: ఏపీలోని విశాఖ జిల్లా ఏజెన్సీలో జరుగుతున్న బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ సమావేశాల్లో తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మంగళవారం నాడు చెప్పారు.
డిసెంబర్ మొదటి వారంలో తాను తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి విశాఖ ఏజెన్సీలో పర్యటిస్తామన్నారు. గిరిజనుల మనోభావాలను తాము గౌరవిస్తామని చెప్పారు.
గవర్నర్, చంద్రబాబు దీపావళి శుభాకాంక్షలు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ నరసింహన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు, ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. విభజన చీకట్లు తొలగి తెలుగు లోగిళ్లు కాంతిమయం కావాలన్నారు.
బైరెడ్డికి అర్హత లేదు: సోమిశెట్టి
హత్య కేసులో నిందితుడిగా ఉన్న బైరెడ్డి రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విమర్శించే నైతిక అర్హత లేదని టిడిపి నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. కర్నూలు జిల్లాకు చంద్రబాబు చొరవ వల్లే ఉర్దూ వర్సిటీ వచ్చిందన్నారు. తామే తెచ్చామని వైసిపి నేతలు ప్రచారం చేసుకోవడం విడ్డూరమన్నారు.