వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మద్దెలచెరువు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్కు ఏడాది జైలు
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన భాను కిరణ్కు నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. అక్రమ ఆయుధాల వినియోగం కేసులో కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది.
జైలు శిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధించింది. భానుతోపాటు మరో ఇద్దరికి కూడా ఇదే కేసులో శిక్షను విధించింది. 2009లో అక్రమ ఆయుధాల కేసులో భాను కిరణ్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపిన కోర్టు బుధవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. మద్దెల చెరువు సూరి హత్య కేసులో కూడా విచారణ కొనసాగుతోంది. ఈ హత్య కేసుకు సంబంధించి గత ఐదేళ్లుగా భానుకిరణ్ జైల్లోనే ఉన్నాడు.
Comments
English summary
Bhanu Kiran, prime accused in the murder of Maddala Suri, has been sentenced to one year in jail, by the Nampally court, in another case.
Story first published: Wednesday, May 9, 2018, 16:17 [IST]