వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ వర్సెస్ టీడీపీ : ఎమ్మిగనూరులో స్థల వివాదంలో గొడవ, 11 మందికి గాయాలు

|
Google Oneindia TeluguNews

ఎమ్మిగనూర్ : ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలు ముగిసి ఫలితాల కోసం వేచి చూస్తున్న తరుణంలో ఆడపా దడపా ఆ రెండు పార్టీ నేతల మధ్య గొడవలు జరగుతూనే ఉన్నాయి. గురువారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది.

 in ap tdp, ycp leaders conflict

పార్కింగ్ విషయంలో ...
ఎమ్మిగనూరు మండలంలోని మాస్ మాన్ దొడ్డిలో రహదారిపై టూ వీలర్ నిలిపిన ఘటన వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణకు దారితీసింది. వైసీపీ పార్టీకి చెందిన శ్రీరాములు తన ఇంటి ముందు టూ వీలర్ నిలిపాడు. ఈ స్థలం తనదని టీడీపీకి చెందిన మల్దకల్ శ్రీనివాసులు చెప్పాడు. వాహనం నిలుపొద్దని అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువర్గాల మధ్య గొడవకు కారణమైంది. మాటలతో మొదలైన గొడవ .. కర్రలు, రాళ్లతో దాడి చేసుకునేవరకు వెళ్లింది.

11 మందికి గాయాలు
ఈ దాడిలో టీడీపీకి చెందిన రామిరెడ్డి, మహేశ్, వెంకటేశ్, గోరంట్ల .. వైసీపీకి చెందిన మాధవస్వామి, చిన్నజయన్న, ఉరుకుందమ్మ, ధనుంజయ, ఉసేనమ్మ, ఉసేనప్ప, మల్దకల్ మొత్తం 11 మంది గాయపడ్డారు. వీరిని ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై రామసుబయ్య పేర్కొన్నారు.

English summary
In the AP, There are conflict between those two party leaders who have been waiting for the results . TDP and the YCP segments took place at Emmiganur in Kurnool district on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X