పొగ పెట్టిన కొట్లాట : బీరు బాటిళ్లతో దాడి చేసుకున్న రెండు గ్రూపులు, నలుగురికి గాయాలు
టెక్కలి : సిగరేట్ పొగ రెండు గ్యాంగుల మధ్య గొడవకు కారణమైంది. వైన్స్ షాపు వద్ద ఉన్న పర్మిట్ రూంలో రెండు గ్రూపులు మందు సేవిస్తున్నారు. ఇంతలో మరో గ్రూపుకు చెందిన ఒకరు సిగరేట్ తాగుతున్నారు. తమకు పొగ వస్తోందని మరో వర్గం అనడం, బయటకెళ్లి తాగమని చెప్పడంతో ఇరువర్గాలు తమ చేతిలో ఉన్న బీరుబాటిళ్లతో దాడిచేసుకునే వరకు వెళ్లింది.
గొడవకు కారణమిదే ?
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండల కేంద్రంలో గల సుదర్శన్ థియేటర్ సమీపంలో రాజా వైన్స్లో గొడవ జరిగింది. వైన్స్ షాపు పర్మిట్ రూంలో రెండు వర్గాలు మందు తాగుతున్నారు. ఇంతలో మరొ వర్గానికి చెందిన వారు సిగరేట్ తాగడం గొడవకు కారణమైంది. మాటలతో మొదలైన గొడవ చేతల వరకెళ్లింది. వీరిలో ఒక వర్గం స్థానికులు కాగా .. మరోకరు పక్కనేగల ఖైజోల గ్రామానికి చెందినవారు. వీరి గొడవలో నలుగురు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరంతా ఖైజోల గ్రామానికి చెందినవారీగా గుర్తించారు.

పోలీసుల రంగప్రవేశం
ఇరువర్గాల గొడవ సమాచారం అందుకొన్న చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరువర్గాలను పోలీసు స్టేషన్ కు తరలించారు. నలుగురు యువకులను ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications