వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో టీఎస్‌ఆర్టీసీ బస్సుబోల్తా.. ఇద్దరు మృతి.. 8 మందికి తీవ్ర గాయాలు

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . తెలంగాణా నుండి ఏపీకి వెళ్తున్న బస్సు బోల్తా పడింది . డ్రైవర్ నిర్లక్ష్యంతో జరిగిన ఘటనలో పలువురికి గాయాలు కాగా ఇద్దరు మృత్యువాత పడ్డారు . తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

<strong>నేడు గవర్నర్ ను కలవనున్న జగన్.. ఎందుకంటే ..</strong>నేడు గవర్నర్ ను కలవనున్న జగన్.. ఎందుకంటే ..

ఈ ఘటన వివరాలలోకి వెళ్తే నిర్మల్‌ నుంచి ఒంగోలు వెళ్తున్న టీఎస్‌ఆర్టీసీకి చెందిన బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట జాతీయ రహదారిపై ఘోరరోడ్డు ప్రమాదానికి గురైంది . దీంతో అక్కడిక్కడే ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

In the AP, the TSRTC bus turned over .. Two dead and 8 serious injuries

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా మృతులు ఆంధ్రప్రాంతానికి చెందినవారుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నారు. మితిమీరిన వేగంతో బస్సు నడుపుతున్న డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

English summary
The road accident happened in AP. The bus which was heading to AP from Telangana was overturned. Two of the victims were died while the driver was neglected. Those who were seriously injured 8 persons were rushed to the hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X