ఏపీలో టీఎస్ఆర్టీసీ బస్సుబోల్తా.. ఇద్దరు మృతి.. 8 మందికి తీవ్ర గాయాలు
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . తెలంగాణా నుండి ఏపీకి వెళ్తున్న బస్సు బోల్తా పడింది . డ్రైవర్ నిర్లక్ష్యంతో జరిగిన ఘటనలో పలువురికి గాయాలు కాగా ఇద్దరు మృత్యువాత పడ్డారు . తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
నేడు గవర్నర్ ను కలవనున్న జగన్.. ఎందుకంటే ..
ఈ ఘటన వివరాలలోకి వెళ్తే నిర్మల్ నుంచి ఒంగోలు వెళ్తున్న టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట జాతీయ రహదారిపై ఘోరరోడ్డు ప్రమాదానికి గురైంది . దీంతో అక్కడిక్కడే ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా మృతులు ఆంధ్రప్రాంతానికి చెందినవారుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నారు. మితిమీరిన వేగంతో బస్సు నడుపుతున్న డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.