వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియా టుడే ఆసక్తికర సర్వే... ఆ విషయంలో దేశంలో వైసీపీదే అగ్ర స్థానం

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఇండియా టుడే ఆసక్తికర సర్వే... దేశంలో వైసీపీదే అగ్ర స్థానం || Oneindia Telugu

దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 19 వ తేదీతో చివరి విడత ఎన్నికలు ముగుస్తాయి.మే 23 న ఫలితాలు వెల్లడి అవుతాయి. అయితే దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలపై ఇండియా టుడే ఒక ఆసక్తికరమైన సర్వే చేసింది. దేశ వ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేసిన లోక్ సభ అభ్యర్థుల క్వాలిఫికేషన్ పై చేసిన ఈ సర్వేలో ఏ పార్టీ నుండి ఎక్కువ మంది విద్యావంతులు ఎన్నికల బరిలో ఉన్నారు అన్న అంశంపై దృష్టి పెట్టింది.

విద్యావంతులను బరిలోకి దింపిన జాబితాలో దేశంలో తొలిస్థానం దక్కించుకున్న వైసీపీ

విద్యావంతులను బరిలోకి దింపిన జాబితాలో దేశంలో తొలిస్థానం దక్కించుకున్న వైసీపీ

ఇక ఆ విషయం అటుంచితే ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు నిలబెట్టిన అభ్యర్థుల చదువు, అర్హతలను సర్వే చేసింది. ఇందుకోసం వారు సమర్పించిన అఫిడవిట్ పత్రాలను విశ్లేషించింది. ఇందులో ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. విద్యావంతులు ఎక్కువగా ఉన్న జాబితాలో ఏపీలోని ప్రతిపక్ష పార్టీ వైసీపీ మొదటి స్థానాన్ని సంపాదించుకుంది.ఇక బరిలో ఉన్న అభ్యర్థులందరూ ఉన్నత విద్యను అభ్యసించిన లోక్ సభ నియోజకవర్గాల్లో శ్రీకాకుళం చోటు దక్కించుకుంది.

ఇండియా టుడే సర్వేలో లోక్ సభ బరిలో ఉన్న వివిధ పార్టీల విద్యావంతుల జాబితా

ఇండియా టుడే సర్వేలో లోక్ సభ బరిలో ఉన్న వివిధ పార్టీల విద్యావంతుల జాబితా

వైసీపీ తరఫున లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో 88 శాతం మంది డిగ్రీ, లేదా అంతకంటే ఎక్కువ పీజీలు చేసిన వారున్నారని ఇండియా టుడే సర్వేలో పేర్కొంది . ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో తమిళనాడుకు చెందిన డీఎంకే 87.5 శాతం డిగ్రీ హోల్డర్లతో నిలవగా , అన్నాడీఎంకే 86.4 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలిచింది.

తెలంగాణా దేశంలో నాలుగో స్థానం ... 82.4 శాతం డిగ్రీ హోల్డర్లతో రాష్ట్రంలో తొలిస్థానం

తెలంగాణా దేశంలో నాలుగో స్థానం ... 82.4 శాతం డిగ్రీ హోల్డర్లతో రాష్ట్రంలో తొలిస్థానం

ఇక తెలంగాణలో అధికార టీఆర్ఎస్ 82.4 శాతం డిగ్రీ హోల్డర్లతో తొలిస్థానంలోనూ , దేశవ్యాప్తంగా నాలుగో స్థానంలో నిలిచింది. ఇక అలాగే ఈ జాబితాలో నామ్ తమిళర్ కట్చి 80 శాతం తో 5 వ స్థానం , సీపీఎం 78 శాతంతో 6వ స్థానం , కాంగ్రెస్ 76 శాతంతో 7వ స్థానం , తృణమూల్ కాంగ్రెస్ 75 శాతంతో 8వ స్థానం బీజేపీ 71 శాతంతో 9వ స్థానంలో నిలిచాయి. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో ఈసారి 139 మంది నిరక్షరాస్యులు బరిలో ఉన్నట్లు ఇండియాటుడే ఇంటెలిజెన్స్ యూనిట్ చెప్పింది. మొత్తానికి విద్యావంతులను బరిలోకి దింపిన వైసీపీ దేశంలో టాప్ 1 లో ఉంది .

English summary
India Today has surveyed the studies and eligibility of candidates who have held political parties across the country in lok sabha polls . They analyzed the affidavit documents submitted for this purpose. It's interesting. In the list of the most educated, the Opposition in the AP YCP has won the first place in the Lok Sabha constituencies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X