ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారి ఫోటోలు పంపించండి...మేము చర్యలు తీసుకుంటాం
పట్టణాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు పాల్పడేవారు కొకోల్లలుగా కనబడతారు. ఆ సమయంలో ట్రాఫిక్ పోలీసులు ఉంటే వారిపై చర్యలు చేపడతారు లేదంటే ఇష్టారాజ్యంగా ట్రాఫిక్ను నిబంధనలు ఉల్లంఘీస్తూ యధేచ్చగా తిరుగుతారు. వారిని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. దీంతో ఏపీ రవాణ శాఖ వారిపై దృష్టి సారించింది. ఇలాంటీ వారు ఎవరైన ప్రజల కంటపడితే వారి ఫోటోలు తీసీ వాట్సప్ తీసీ మాకు పంపాలని కోరుతోంది. ఈ నేపథ్యంలోనే వారికి చెక్ పెట్టేందుకు వినూత్న ప్లాన్ వేసింది.
కాగా ఈ నిర్ణయాన్ని సెప్టెంబర్ ఒకటి నుండే అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. ఇందుకోసం ఓ వాట్సప్ నంబర్ కూడ విడుదల చేసింది. ట్రాఫిక్ అతిక్రమణలకు పాల్పడిన వారి ఫోటోలు పంపించేందుకు . 95428 00800 వాట్సప్ నెంబర్ సైతం విడుదల చేసింది. కాగా పిర్యాధుదారులు పంపిణ ఫోటోలను రవాణశాఖకు చెందిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు పరిశీలించనున్నాయి. అనంతరం వెహికిల్ నెంబర్తో ట్రిఫిక్ నిబంధనలు అతిక్రమించిన వ్యక్తి అడ్రస్కు చాలాన్లు ప్రక్రియను చేపట్టనుంది.
ఇలా అన్ని జిల్లాలోని ప్రజలను నేరుగా భాగస్వాములను చేయడం ద్వారా ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణకు పాల్పడేవారికి అడ్డుకట్ట వేయడం సులభతరమవుతుందని రవాణా శాఖ ఆశిస్తోంది. మరోవైపు నిబంధనలు అతిక్రమించే వారికి భారీ జరిమానాలు కూడ వేసేందుకు సన్నహాలు చేస్తోంది. ఎక్కువగా నిబంధనలు ఉల్లంఘించినవారి లైసెన్స్లను కూడ రద్దు చేసేదుకు ప్లాన్ చేస్తోంది. అయితే రవాణశాఖకు పంపే ఫోటోలు స్పష్టంగా ఉండాలని అధికారులు సూచించారు.