ఏపీ వచ్చే వారికి గుడ్ న్యూస్- ఈ-పాస్ జారీలో సర్కార్ మార్పులు..
కరోనా వైరస్ ప్రభావం మొదలయ్యాక వివిధ రాష్ట్రాల మధ్య ప్రయాణాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ తర్వాత అన్ లాక్ ప్రారంభమయ్యాక ఈ ఆంక్షలను కేంద్రం తొలగించింది. అయితే ఏపీ మాత్రం ఆంక్షలను ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఏపీలోకి వచ్చే వారికి ఈ-పాస్ తప్పనిసరి చేసింది.
ఈ-పాస్ లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులను ఇప్పటికీ అనుమతించడం లేదు. కానీ తాజాగా ఈ-పాస్ రూల్స్ లో ప్రభుత్వం మార్పులు చేసింది. రేపటి నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి.
ఇప్పటివరకూ ఈ-పాస్ పొందాలంటే ఏపీ ప్రభుత్వ స్పందన పోర్టల్ లో దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించారు. ఇందులో ఏపీకి రావడానికి సరైన కారణాలు ఉంటేనే పరిశీలించి అనుమతి మంజూరు చేస్తున్నారు. లేకపోతే తిరస్కరిస్తున్నారు కూడా.
Recommended Video
తాజాగా అధికారుల జోక్యం లేకుండా నేరుగా దరఖాస్తు చేసుకున్న వారికి ఆటోమేటిగ్గా అనుమతి మంజూరు చేసేలా ఆంక్షలు సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే దరఖాస్తు చేసుకున్న వారు కోరిన వివరాలు అందిస్తే చాలు వాటిని మరోసారి పరిశీలించకుండా నేరుగా సిస్టమ్ జనరేటెడ్ మెసేజ్ ద్వారా 24 గంటల్లో ఈ-పాస్ జారీ అయిపోతుంది.