విశాఖ ఐపిఎల్ మ్యాచ్లో వీధి కుక్కల హడావుడి(ఫొటోలు)
విశాఖపట్నం: నగరంలోని మైదానంలో మంగళవారం ఢిల్లీ డేర్డెవిల్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో కాసేపు వీధి కుక్కలు హడావుడి చేశాయి. అంతేగాక, మ్యాచ్కు కొంత అంతరాయం కూడా కలిగించాయి.
ఏకంగా మ్యాచ్ జరుగుతుండగా మైదానం మధ్యలోకి చొచ్చుకొచ్చేసింది ఓ వీధి కుక్క. అప్పటికే తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్డెవిల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది.
విరామం తర్వాత ఛేదనకు దిగిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టు కేవలం ఐదు బంతులు మాత్రమే ఆడింది. ఈ దశలో మైదానంలోకి కుక్క రావడంతో క్రీజులో ఉన్న ఓపెనర్లు రహానె, ఖవాజా ఏకాగ్రత లోపిస్తుందని అసహనానికి గురవగా.. ఢిల్లీ ఫీల్డర్లు రిషబ్ పంత్, కౌల్టర్ నైల్, క్రిస్ మోరిస్ దాన్ని బుజ్జగించి బయటికి పంపే ప్రయత్నం చేశారు.
కాగా, ఓ టవల్తో పంపేందుకు నైల్ కాసేపు ప్రయత్నించాడు. ఇలా దాదాపు రెండు మూడు నిమిషాల పాటు వారితో ఆడుకున్న ఆ కుక్కను ఆ తర్వాత మైదానం సిబ్బంది వచ్చి బయటికి పంపేశారు.