వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాజెక్టుల్లో అవినీతిపై చర్చకు దేవినేని ఉమ సిద్ధమేనా?: శ్రీకాంత్ రెడ్డి సవాల్

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రాజెక్టుల పేరుతో టీడీపీ నేతలు అడ్డగోలుగా దోచుకుంటున్నారని, అంచనాలను అమాంతం పెంచి అందినకాడికి దోచుకుటున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి విమర్శించారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పని చేయకుం‍డా బిల్లులు తీసుకుంటున్నారని ఆరోపించారు. వెలిగొండ ప్రాజెక్ట్‌లో అంచనాలను అమాంతం పెంచి అందినకాడికి దోచుకుంటున్నారని శ్రీకాంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

Is Minister Devinani Um ready for discussion on Corruption in Projects?

ప్రాజెక్టుల్లో అవినీతిపై చర్చకు తాము సిద్ధమని, మంత్రి దేవినేని ఉమ సిద్ధమేనా? అంటూ ఆయన సవాల్‌ విసిరారు. వ్యవసాయం, ప్రాజెక్టులపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, 'మనసులో మాట' పుస్తకంలోనే ఆ విషయం చెప్పారని ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

మరి శ్రీకాంత్ రెడ్డి సవాల్‌కు మంత్రి దేవినేని ఉమ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఆయన మీడియాను పిలిచి శ్రీకాంత్ రెడ్డిపై విమర్శలు కురిపిస్తారా? లేక శ్రీకాంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించి, ప్రాజెక్టుల్లో అవినీతిపై చర్చకు దిగుతారా? అన్నది వేచి చూడాల్సిందే.

English summary
YSRCP MLA Srikanth Reddy critisized TDP leaders that they are minting money from the irrigation projects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X