ప్రాజెక్టుల్లో అవినీతిపై చర్చకు దేవినేని ఉమ సిద్ధమేనా?: శ్రీకాంత్ రెడ్డి సవాల్
అమరావతి: ప్రాజెక్టుల పేరుతో టీడీపీ నేతలు అడ్డగోలుగా దోచుకుంటున్నారని, అంచనాలను అమాంతం పెంచి అందినకాడికి దోచుకుటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పని చేయకుండా బిల్లులు తీసుకుంటున్నారని ఆరోపించారు. వెలిగొండ ప్రాజెక్ట్లో అంచనాలను అమాంతం పెంచి అందినకాడికి దోచుకుంటున్నారని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
ప్రాజెక్టుల్లో అవినీతిపై చర్చకు తాము సిద్ధమని, మంత్రి దేవినేని ఉమ సిద్ధమేనా? అంటూ ఆయన సవాల్ విసిరారు. వ్యవసాయం, ప్రాజెక్టులపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, 'మనసులో మాట' పుస్తకంలోనే ఆ విషయం చెప్పారని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మరి శ్రీకాంత్ రెడ్డి సవాల్కు మంత్రి దేవినేని ఉమ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఆయన మీడియాను పిలిచి శ్రీకాంత్ రెడ్డిపై విమర్శలు కురిపిస్తారా? లేక శ్రీకాంత్ రెడ్డి సవాల్ను స్వీకరించి, ప్రాజెక్టుల్లో అవినీతిపై చర్చకు దిగుతారా? అన్నది వేచి చూడాల్సిందే.