జగన్ దీక్షకు మోసూరా డుమ్మా: అసంతృప్తేనా?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చేపట్టిన దీక్షకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత మైసూరా రెడ్డి దూరంగా ఉన్నారు. ఆయన దీక్షకు హాజరుకాకపోవడంపై వివిధ రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలోనే ఆయన పార్టీ వీడవచ్చుననే ఊహాగానాలు వినిపించాయి.
మైసూరా రెడ్డి అలకపాన్పు ఎక్కారని, అందుకే దీక్షకు హాజరు కాలేదని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల విజయ సాయి రెడ్డి పార్టీలో చేరారు.
దశాబ్దాల అనుభవం ఉన్నకాదని, ఆయనకు ప్రాధాన్యం ఇస్తున్నారని మైసూరా రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే, మైసూరా రెడ్డి కావాలనే హాజరు కాలేదా లేక మరేమైనా కారణాలు ఉన్నాయా తెలియాల్సి ఉంది.
ఆంధ్రా రాజధాని నిర్మాణంపై సింగపూర్ బృందం సమీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని నగర నిర్మాణంపై సింగపూర్ నిపుణుల బృందం రాష్ట్ర అధికారులతో సమీక్షించనుంది. హైదరాబాద్ రానున్న నిపుణుల బృందం హైదరాబాద్లోని సచివాలయంలో రాజధాని పర్యటన, నిర్మాణ ప్రణాళికలపై చర్చించి ఒక నిర్ణయానికి రానుంది.