కాంగ్రెస్Vsకాంగ్రెస్: అరగంట వట్టి, 10ని.ల్లో దామోదర
అనంతరం దామోదర విలేకరులతో మాట్లాడుతూ... పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. రాజ్యాంగ్ ప్రకారం తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలన్నారు. ఉమ్మడి రాజధానిని హైదరాబాదు రెవెన్యూ జిల్లాకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఐదేళ్లు ఉంచాలని కోరినట్లు చెప్పారు.
భద్రాచలం తెలంగాణలోనే ఉంటుందన్నారు. సీమాంధ్రకు దానిని ఇస్తే చిక్కులొస్తాయన్నారు. గోదావరి పైన రెగ్యురేటరీ అథారిటీ అవసరం లేదన్నారు. ఆంధ్రా ప్రాంతానికి అవసరమైన ప్యాకేజీని ఇవ్వాలని, ఉద్యోగుల విషయంలో 371 డిని కొనసాగించాలని కోరినట్లు చెప్పారు. జనవరి 1 నాటికి తెలంగాణ ఏర్పడుతుందన్నారు.
జివోఎంకు నివేదిక ఇచ్చిన వట్టి మాట్లాడుతూ... విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. విభజనతో రెండు ప్రాంతాలకు అన్నీ నష్టాలే అన్నారు. విభజన నిర్ణయం అనాలోచితమని, కచ్చితంగా పునరాలోచించుకోవాలన్నారు. జల వనరుల పంపిణీ అసాధ్యమని, ఏ కమిటీ, ఏ కమిషన్ కూడా నీటి పంపిణీని పర్యవేక్షించలేవన్నారు. హైదరాబాదు చుట్టు పక్కల అనేక సమస్యలు ఉన్నాయని, వీటిని ఎవరు పరిష్కరించలేరన్నారు.