ఒత్తిడిలో కూడా అద్బుత విజయాన్నందించింది.!పీవి సింధు తండ్రి రమణ ఉద్వేగం.!
హైదరాబాద్: భారత్ వెలిగిపోయింది. మరోసారి భారత్ గర్వించింది. గర్జించింది. దేశ ఖ్యాతిని మరోసారి నలుదిశలు వ్యపించేలా చేసింది తెలుగుతేజం, భరతమాత ముద్దు బిడ్డ పీవి సింధు. టోక్యో ఒలంపిక్స్ లో కాస్యం సాధించడంతో భారతదేశం పేరు ప్రపంచ దేశాల్లో మరోసారి మారుమోగిపోయింది. అంతే కాకుండా టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచిన పీవీ సింధుకు దేశ రాజకీయ నేతలనుండే కాకుండా ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
కఠోర శ్రమ, పట్టుధల, అకుంఠిత దీక్షతో తెలుగుతేజం సింధు విజయం సాధించిందని, ఈ విజయం దేశానికే గర్వకారణయని, యావత్ దేశం గర్వించదగ్గ క్షణాలివని, ఈ తరం క్రీడాకారులకు పీవీ సింధు ప్రేరణ, ఆదర్శం అని పలువురు అభినందిస్తున్నారు. సింధు భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్ధాయికి ఎదగాలని, దేశానికి మరింత మంచి పేరు తీసుకురావాలి పలువురు ఆకాంక్షిస్తున్నారు. ఇక పివీ సిందు తండ్రి రమణ కూతురు విజయం పట్ల వినూత్నంగా స్పందించారు.
Recommended Video
టోక్యో ఒలంపిక్ క్రీడల్లో భాగంగా షటిల్ మైదనాంలో తీవ్రమైన ఒత్తిడి మధ్య పీవీ సింధు విజయం సాధించిందని ఆమె తండ్రి రమణ భావోద్వేగానికి లోనయ్యారు. దేశం మొత్తం సింధుకు అండగా నిలిచిందని గర్వంగా ఉప్పొంగిపోయారు. పీవి సింధు దేశానికి పతకం సాధించడం గర్వంగా ఉందన్నారు. వరుసగా రెండు పతకాలు సాధించడం ఆనందంగా ఉందని తెలిపారు. శనివారం నాటి ఓటమి గురించి మరిచిపోయి, ఆదివారం ఆట మీద దృష్టి పెట్టాలని చెప్పానని, వ్యక్తిగత ఈవెంట్లో దేశానికి రెండు మెడల్స్ తీసుకురావడం గర్వించదగ్గదన్నారు. సింధు పతకం సాధించడం ఆనందంగా ఉందని, సింధు తల్లి విజయ అన్నారు. సింధు మ్యాచ్ను చివరి నిమిషం వరకు ఉత్కంఠగా చూశానని విజయ స్పష్టం చేసారు. ఈ సందర్బంగా సింధు పేరెంట్స్ కాస్త భావోద్వేగానికి గురైనట్టు తెలుస్తోంది.