27న జగన్ గృహ ప్రవేశం : వారందరికీ ఆహ్వానాలు: అదే రోజు భారీగా వైసిపి లోచేరికలు..!
వైసిపి అధినేత జగన్ ఇక అమరావతి కేంద్రంగా ఎన్నికల బరిలోకి దిగనున్నారు. అమరావతి సమీపంలోని తాడేపల్లి వద్ద జగన్ కొత్త ఇంటిని ...పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్నారు. ఈ నెల 27న ఆ ఇంటి గృహప్రవేశం జరగనుంది. ఆ కార్యక్రమానికి పలువురుకి ఆహ్వానాలు పంపారు. అదే రోజు పార్టీలో చేరికలు ప్రారంభం కానున్నాయి.
27న
గృహప్రవేశానికి
ఆహ్వానాలు..
వైసిపి
అదినేత
జగన్
తాడేపల్లి
లో
నిర్మించిన
నివాసం..పార్టీ
కార్యాలయం
కు
ఈ
నెల
27న
గృమ
ప్రవేశం
జరగనుంది.
వాస్తవానికి
ఫిబ్రవరి
14న
ఉదయం
8.21
నిమిషాలకు
చేయాలని
ముహూర్తం
ఖరారు
చేశారు.
కానీ,
కుటుంబపరమైన
కార
ణాలతో
గృహ
ప్రవేశాన్ని
వాయిదా
వేస్తున్నట్లు
వైసీపీ
వర్గాలు
తెలిపాయి.
ఆ
తర్వాత
జగన్
లండన్
వెళ్లడంతో
దీనికి
తా
త్కాలికంగా
బ్రేక్
పడింది.
ఈ కార్యక్రమానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షు లు, ఎంపీలు, ఎ మ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియో జ కవర్గ సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నాయకులంద రూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆహ్వానించారు. ఇక, అక్కడి నుండే జగన్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.
ఆ
రోజే
పార్టీలోకి
చేరికలు..
ఈ
నెల
27న
గృహ
ప్రవేశం
పూర్తయిన
తరువాత
జగన్
పార్టీ
నేతలతో
కొత్త
కార్యాలయం
లో
సమావేశం
ఏర్పాటు
చేసారు.
ఆ
సమావేశానికి
పార్టీ
నేతలకు
ఆహ్వానాలు
అందాయి.
అదే
విధంగా..కొత్తగా
పార్టీలో
చేరే
వారు
ఆరోజున
భారీగా
తమ
అనుచరుతలతో
కలిసి
పార్టీ
నూతన
కార్యాలయానికి
రానున్నారు.
ఇప్పటికే
టిడిపికి
రాజీనామా
చేసిన
చీరాల
ఎమ్మెల్యే
ఆమంచి
కృష్ణ
మోహన్
27న
అధికారికంగా
వైసిపి
లో
చేరనున్నారు.
అదే విధంగా దగ్గుబాటి కుటుంబ సభ్యులు, విజయవాడ నుండి వైసిపి అభ్యర్దిగా బరిలోకి దిగనున్న దాసరి జై రమేష్ ఆ రోజే అధికారికంగా వైసిపి లో చేరేందుకు ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక, మరో వారం లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో ఈ నెల 28, మార్చి1న పెద్ద సంఖ్యలో టిడిపి నుండి వలసలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రకాశం. తూర్పు గోదావరి జిల్లాకు చెందని అధికార పార్టీ నేతలు వైసిపి లో వస్తారని తెలుస్తోంది.