పులివెందులలో జగన్ ముందంజ .. భీమవరంలో పవన్ వెనుకంజ
పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఆధిక్యంలో ఉన్నారు. పులివెందుల అసెంబ్లీ స్థానం నుండి జగన్ మరోసారి బరిలోకి దిగారు. 2014 ఎన్నికల్లో పులివెందుల స్థానం నుండి జగన్ ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి పులివెందులలో జగన్ ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి సుమారు రెండు వేల ఓట్ల ఆధిక్యంలో జగన్ ఉన్నారు.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరం నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. మెుదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 625 పైచిలుకులు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కంటే ముందు వరుసలో ఉన్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గాజు వాక నియోజకవర్గంలో ముందుంజలో ఉన్నారు. భీమవరం నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీల మధ్య హోరా హోరి పోరు నడిచింది. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి వెనుకంజలో ఉన్నారు.