వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోర్టుకు జగన్, సాయి: దేశవ్యాప్త టూర్‌పై 12న విచారణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఆస్తుల కేసులో సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్(సిబిఐ) ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. జగన్‌తో పాటు ఆడిటర్ విజయ సాయి రెడ్డి కూడా కోర్టుకు వచ్చారు.

రఘురాం, భారతి సిమెంట్స్ ఛార్జీషీటు పైన కోర్టులో విచారణ జరిగింది. దీనికోసం వారు కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఈ ఛార్జీషీటు పైన విచారణను సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం డిసెంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.

బెయిల్ సడలింపు పిటిషన్ విచారణ 12వ తేదికి

మరోవైపు తనకు దేశవ్యాప్త పర్యటనలకు షరతులను సడలించాలని వైయస్ జగన్ వేసిన పిటిషన్ పైన విచారణను కోర్టు ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.

కాగా తనకు దేశవ్యాప్త పర్యటనలకు షరతులను సడలించాలని వైయస్ జగన్ బుధవారం సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా, ఓ నియోజకవర్గ పార్లమెంటు సభ్యుడిగా ప్రజలకు సేవలందించాల్సి బాధ్యత ఉందని తెలిపారు. తనపై నేరం ఇంకా రుజువు కానందున నియోజకవర్గానికి, పార్టీకి సేవలు అందించే హక్కులను కాలరాయరాదని కోరారు. ఇందుకు సంబంధంచి జగన్ రెండు పిటిషన్‌లు దాఖలు చేశారు.

English summary
The CBI court has adjourned YSR Congress Party chief YS Jaganmohan Reddy's petition to November 12.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X