కోర్టుకు జగన్, సాయి: దేశవ్యాప్త టూర్పై 12న విచారణ
రఘురాం, భారతి సిమెంట్స్ ఛార్జీషీటు పైన కోర్టులో విచారణ జరిగింది. దీనికోసం వారు కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఈ ఛార్జీషీటు పైన విచారణను సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం డిసెంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.
బెయిల్ సడలింపు పిటిషన్ విచారణ 12వ తేదికి
మరోవైపు తనకు దేశవ్యాప్త పర్యటనలకు షరతులను సడలించాలని వైయస్ జగన్ వేసిన పిటిషన్ పైన విచారణను కోర్టు ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.
కాగా తనకు దేశవ్యాప్త పర్యటనలకు షరతులను సడలించాలని వైయస్ జగన్ బుధవారం సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా, ఓ నియోజకవర్గ పార్లమెంటు సభ్యుడిగా ప్రజలకు సేవలందించాల్సి బాధ్యత ఉందని తెలిపారు. తనపై నేరం ఇంకా రుజువు కానందున నియోజకవర్గానికి, పార్టీకి సేవలు అందించే హక్కులను కాలరాయరాదని కోరారు. ఇందుకు సంబంధంచి జగన్ రెండు పిటిషన్లు దాఖలు చేశారు.