వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడే జ‌గ‌న్ అనంత‌పూర్ ప‌ర్య‌ట‌న‌..! ఎన్నిక‌ల స‌మ‌ర శంఖారావానికి శ్రీ‌కారం..!!

|
Google Oneindia TeluguNews

అనంతపురం/ హైద‌రాబాద్: ఆంద్ర ప్ర‌దేశ్ లో బ‌హిరంగ స‌భ‌ల సీజ‌న్ న‌డుస్తున్న‌ట్టు తెలుస్తోంది. జ‌న‌సైన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్, ఏపి సీయం చంద్ర‌బాబు, బీజేపి తో పాటు ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపి కూడా బ‌హిరంగ‌స‌భ‌లు నిర్వ‌హించి ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యే ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహనరెడ్డి సోమవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు అనంతపురం నగరానికి చేరుకుని శ్రీ7 కన్వెన్షన్ హాల్ కు చేరుకుంటారు. ఆ కన్వెన్షన్ హాల్లో అనంతపురం జిల్లాకు చెందిన వివిధ రంగాలకు చెందిన తటస్తులతో వైఎస్.జగన్ సమావేశమవుతారు.

Jagan to visit Ananthapur today..! Ready to election campaign..!!

అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు బెంగుళూరు రోడ్డులో ఉన్న అశోక్ లేల్యాండ్ షోరూమ్ ఎదురుగా ఉన్న స్ధలంలో జరిగే సమర శంఖారావం సభలో పాల్గొంటారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సభ్యులతో సమావేశమవుతారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరపున వ్యవహరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చిస్తారు. బూత్ కమిటీ సభ్యులకు, వైసీపీ కార్యకర్తలకు జగన్మోహనరెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే చిత్తూరు, కడప జిల్లాల్లో సమర శంఖారావ సభలు పూర్తి చేసిన జగ్మోహనరెడ్డి సోమవారం అనంతపురం జిల్లాలో ఎన్నికల సమర శంఖం పూరించనున్నారు.

English summary
YS Jaganmohan Reddy, who heads the YSR Congress party, will visit Anantapur district on Monday. He reach Anantapur on Monday morning at 11 am at the Sri 7 Convention Hall. YS Jagan will meet with the league of various sectors of the Anantapur district in the convention hall.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X