కెసిఆర్పై జగ్గారెడ్డి నిప్పులు, డిఎస్ సిఎంఐతే ఒకే: విహెచ్
డిఎస్ అయితే ఓకే: విహెచ్
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అధ్యక్షులు డి శ్రీనివాస్ ముఖ్యమంత్రి అయితే తాము మద్దతిస్తామని రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు అన్నారు. తనను అంబర్ పేట నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నారని, సోనియా గాంధీ ఏం చెబితే అది చేస్తానని చెప్పారు. ఈ నెల 19న అమరవీరుల కుటుంబాలతో సమావేశమై, వారు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుంటామని చెప్పారు.
కిరణ్ మోసం చేశారు: కంతేటి
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు పార్టీని మోసం చేశారని ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ రాజు మండిపడ్డారు. కాంగ్రెసులో గంజాయీ మొక్కల సంఖ్య పెరిగిందని, పార్టీలో కుల, మత, అవినీతి ప్రాబల్యం అధికమయిందని మండిపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెసు పార్టీ కష్టాల్లో ఉందన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా నేతలు బరిలోకి దిగితే కాంగ్రెసు బలపడుతుందన్నారు.
హైదరాబాద్కు వంశీచంద్ పాదయాత్ర
కాంగ్రెసు పార్టీ యువజన అధ్యక్షుడు వంశీచంద్ రెడ్డి వరంగల్ నుండి చేపట్టిన పాదయాత్ర హైదరాబాదులోకి ప్రవేశించింది. ఉప్పల్ వద్ద ఆయనకు ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి, ఇతరులు ఘన స్వాగతం పలికారు. ఈ పాదయాత్ర గన్ పార్కుకు చేరుకోగానే బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు.