కెసిఆర్తో జాగ్రత్త: జగ్గారెడ్డి, అంతా గమనిస్తున్నా:యాష్కీ
తెరాస కాంగ్రెస్లో విలీనం అయితే తమ సీట్లకు తప్పకుండా చెక్ పెడతారని యాష్కీతో చెప్పారు. కెసిఆర్ ముందు ఆయన భార్య, కొడుకు, కూతురు పాయిజన్ బాటిల్ పెట్టుకుని బెదిరించి అయినా సీట్లు దక్కించుకుంటారన్నాన్నారు. తెలంగాణ వచ్చాక హరీశ్ రావును కూడా పక్కనబెడతారని చెప్పారు.
కల్వకుంట్ల కవిత నీ సీట్లోకి జొరపడాలని చూస్తోందని, రిజర్వేషన్ల పేరుతో కొద్దిమంది పెద్దలు తమ సీట్లకు డోకా లేకుండా చేసుకుంటున్నారని యాష్కీకి చెప్పారు. మీది జనరల్ సీటని, ఎసరు పెడతారు జాగ్రత్త అన్నారు. అందుకు మధుయాష్కీ.. తాను గమనిస్తున్నానని చెప్పారు.
కెసిఆర్పై యాష్కీ
కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే బేషరతుగా తెరాసను విలీనం చేస్తానన్న కెసిఆర్ ఇప్పుడు మాట మార్చారని మధుయాష్కి మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ వచ్చిందని కెసిఆర్ సంబరపడుతున్నారని అయితే తాము కోరుకున్నది సామాజిక తెలంగాణ అని మధుయాష్కి తెలిపారు.