వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రత్యేక ఆకర్షణ: గవర్నర్ పిలుపుతో ఎట్హోంకు పవన్!
హైదరాబాద్: దేశ 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇచ్చే అల్ఫాహార విందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.
ఈ మేరకు విందుకు హాజరు కావాలని గవర్నర్ ప్రత్యేకంగా పవన్ను ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు ఈ సాయంత్రం రాజ్భవన్లో జరిగే తేనీటి విందులో పవన్ పాల్గొననున్నారు. కాగా, తొలిసారిగా పవన్కు గవర్నర్ నుంచి ఆహ్వానం అందడం గమనార్హం.
దీంతో ఎట్హోంగా పిలిచే ఈ అల్పాహార విందు కార్యక్రమంలో పవన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు మంత్రులు, స్పీకర్లు, కౌన్సిల్ ఛైర్మన్లు హాజరుకానున్నారు. వీరితో పాటు ఈసారి కేంద్ర, రాష్ట్రస్థాయిల్లో అవార్డులు అందుకున్న అధికారులు, నగరంలోని పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Comments
pawan kalyan janasena independence day india celebrations oneindia పవన్ కళ్యాణ్ జనసేన స్వాతంత్ర్య దినోత్సవం పండగ వన్ఇండియా
English summary
It is said that JanaSena Chief Pawan Kalyan invited by Governor Narasimhan to attend at home programme.
Story first published: Tuesday, August 15, 2017, 17:10 [IST]